ETV Bharat / sports

ఐపీఎల్: ఆటగాళ్ల రిటెన్షన్​కు ఆఖరు తేదీ ఇదే - ఐపీఎల్​ 2021

ఈ ఏడాది మెగాలీగ్​లో పాల్గొనే ఫ్రాంచైజీలు.. తాము అంటిపెట్టుకున్న ఆటగాళ్లు, ట్రేడింగ్​ విండో వివరాలను జనవరి 21, ఫిబ్రవరి 4వ తేదీలోగా సమర్పించాలని ఆదేశించింది ఐపీఎల్​ గవర్నింగ్​ కౌన్సిల్​. అలాగే వేలంపాటలో ఆటగాళ్ల కొనుగోలు విషయమై రూ.85 కోట్లు మించి ధర వెచ్చించరాదని సదరు జట్ల యాజమాన్యాలకు సూచించింది.

ipl
ఐపీఎల్​
author img

By

Published : Jan 7, 2021, 8:30 PM IST

ఐపీఎల్ 2021​ నిర్వహణ పనులు ప్రారంభమైపోయాయి. ఈ మెగాలీగ్​లో పాల్గొనే ఎనిమిది ఫ్రాంచైజీలు .. తాము అంటిపెట్టుకున్న ఆటగాళ్లు, ట్రేడింగ్​ విండో వివరాలను సమర్పించేందుకు గడువు తేదీని ప్రకటించింది ఐపీఎల్​ గవర్నింగ్​ కౌన్సిల్​. జనవరి 21లోగా అంటిపెటుకున్న ఆటగాళ్లు​, ఫిబ్రవరి 4వ తేదీలోగా ట్రేడింగ్​ విండో వివరాలను సమర్పించాలని ఆదేశించింది. ఈ విషయాన్ని లీగ్​ ఛైర్మన్​ బ్రిజేష్​ పటేల్​ తెలిపారు.

కాగా, ఫిభ్రవరి మూడో వారంలో మినీ వేలంపాట జరగనుంది. అయితే ఈ ఆక్షన్​లో సంబంధిత ఫ్రాంచైజీలు.. ఆటగాళ్లను కొనుగోలు చేసే విషయమై రూ.85 కోట్లు మించి ధర వెచ్చించరాదని సదరు ఫ్రాంచైజీలకు సూచించారు పటేల్​.

ఐపీఎల్ 2021​ నిర్వహణ పనులు ప్రారంభమైపోయాయి. ఈ మెగాలీగ్​లో పాల్గొనే ఎనిమిది ఫ్రాంచైజీలు .. తాము అంటిపెట్టుకున్న ఆటగాళ్లు, ట్రేడింగ్​ విండో వివరాలను సమర్పించేందుకు గడువు తేదీని ప్రకటించింది ఐపీఎల్​ గవర్నింగ్​ కౌన్సిల్​. జనవరి 21లోగా అంటిపెటుకున్న ఆటగాళ్లు​, ఫిబ్రవరి 4వ తేదీలోగా ట్రేడింగ్​ విండో వివరాలను సమర్పించాలని ఆదేశించింది. ఈ విషయాన్ని లీగ్​ ఛైర్మన్​ బ్రిజేష్​ పటేల్​ తెలిపారు.

కాగా, ఫిభ్రవరి మూడో వారంలో మినీ వేలంపాట జరగనుంది. అయితే ఈ ఆక్షన్​లో సంబంధిత ఫ్రాంచైజీలు.. ఆటగాళ్లను కొనుగోలు చేసే విషయమై రూ.85 కోట్లు మించి ధర వెచ్చించరాదని సదరు ఫ్రాంచైజీలకు సూచించారు పటేల్​.

ఇదీ చూడండి : 'ఆ సమయంలో కన్నీరు ఆపుకోలేకపోయా'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.