ETV Bharat / sports

అశ్విన్ పాంచ్ పటాకా.. దక్షిణాఫ్రికా 385/8 - Dean Elgar, Quinton De Kock Star As South Africa Fight Back On Day 3

భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతోన్న తొలి టెస్టు మూడో రోజు ఆట ముగిసింది. తొలి ఇన్నింగ్స్​లో 117 పరుగులు వెనకబడి ఉంది సఫారీ జట్టు.

మ్యాచ్
author img

By

Published : Oct 4, 2019, 5:42 PM IST

మూడు వికెట్ల నష్టానికి 39 పరుగులతో మూడో రోజు ఆటను కొనసాగించిన దక్షిణాఫ్రికా నిలకడగా ఆడుతూ పరుగులు సాధించింది. 63 పరుగుల వద్ద 18 రన్స్ చేసిన బవుమాను ఇషాంత్ పెవిలియన్ పంపాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన డుప్లెసిస్​తో కలిసి ఓపెనర్ డీన్ ఎల్గర్​ భారత బౌలర్లను సమర్థవంతగా ఎదుర్కొన్నాడు. ఐదో వికెట్​కు వీరిద్దరూ 115 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

భారీ స్కోర్ దిశగా సాగుతున్న దశలో అశ్విన్ వీరిద్దరి భాగస్వామ్యానికి తెరదించాడు. 55 పరుగులు చేసిన సారథి డుప్లెసిస్​ను పెవిలియన్ చేర్చాడు. అనంతరం డికాక్, ఎల్గర్​ మరోసారి భారత బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టారు. వీరిద్దరూ ఆరో వికెట్​కు 166 పరుగులు జోడించారు. ఈ దశలో ఎల్గర్ (160)​ను జడేజా బోల్తా కొట్టించగా.. డికాక్ (111) అశ్విన్​ చేతికి చిక్కాడు. ఫిలాండర్ (0) తొందరగానే ఔటవగా.. మూడో రోజు ఆటముగిసే సమయానికి సఫారీ జట్టు 8 వికెట్ల నష్టానికి 385 పరుగులు చేసింది. మరో 117 పరుగుల వెనుకంజలో ఉంది.

భారత బౌలర్లలో అశ్విన్​ 5 వికెట్లతో సత్తాచాటగా.. జడేజా రెండు, ఇషాంత్ శర్మ ఒక వికెట్ దక్కించుకున్నారు.

ఇవీ చూడండి.. క్రికెట్​కు వీడ్కోలు పలికేందుకు హర్భజన్​ సిద్ధం..!

మూడు వికెట్ల నష్టానికి 39 పరుగులతో మూడో రోజు ఆటను కొనసాగించిన దక్షిణాఫ్రికా నిలకడగా ఆడుతూ పరుగులు సాధించింది. 63 పరుగుల వద్ద 18 రన్స్ చేసిన బవుమాను ఇషాంత్ పెవిలియన్ పంపాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన డుప్లెసిస్​తో కలిసి ఓపెనర్ డీన్ ఎల్గర్​ భారత బౌలర్లను సమర్థవంతగా ఎదుర్కొన్నాడు. ఐదో వికెట్​కు వీరిద్దరూ 115 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

భారీ స్కోర్ దిశగా సాగుతున్న దశలో అశ్విన్ వీరిద్దరి భాగస్వామ్యానికి తెరదించాడు. 55 పరుగులు చేసిన సారథి డుప్లెసిస్​ను పెవిలియన్ చేర్చాడు. అనంతరం డికాక్, ఎల్గర్​ మరోసారి భారత బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టారు. వీరిద్దరూ ఆరో వికెట్​కు 166 పరుగులు జోడించారు. ఈ దశలో ఎల్గర్ (160)​ను జడేజా బోల్తా కొట్టించగా.. డికాక్ (111) అశ్విన్​ చేతికి చిక్కాడు. ఫిలాండర్ (0) తొందరగానే ఔటవగా.. మూడో రోజు ఆటముగిసే సమయానికి సఫారీ జట్టు 8 వికెట్ల నష్టానికి 385 పరుగులు చేసింది. మరో 117 పరుగుల వెనుకంజలో ఉంది.

భారత బౌలర్లలో అశ్విన్​ 5 వికెట్లతో సత్తాచాటగా.. జడేజా రెండు, ఇషాంత్ శర్మ ఒక వికెట్ దక్కించుకున్నారు.

ఇవీ చూడండి.. క్రికెట్​కు వీడ్కోలు పలికేందుకు హర్భజన్​ సిద్ధం..!

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.