ETV Bharat / sports

ఖేల్​రత్న పురస్కారం కోసం అశ్విన్, మిథాలీ

author img

By

Published : Jun 30, 2021, 1:01 PM IST

దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ఖేల్​రత్నకు స్పిన్నర్​ అశ్విన్​, మిథాలీ రాజ్ పేర్లను సిఫార్సు చేసింది భారత క్రికెట్ బోర్డు. అర్జున అవార్డుకూ పలువురు క్రికెటర్ల పేర్లను ప్రతిపాదించింది.

Khel Ratna
ఖేల్​రత్న

దేశ అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్ గాంధీ ఖేల్​రత్నకు టీమ్ఇండియా ఆటగాళ్లు రవిచంద్రన్ అశ్విన్, మిథాలీ రాజ్​ల పేర్లను బీసీసీఐ సిఫార్సు చేసింది. బుమ్రా, కేఎల్‌.రాహుల్‌, ధావన్‌ పేర్లు అర్జున అవార్డు కోసం ప్రతిపాదించింది.

అశ్విన్ తన కెరీర్​లో 79 టెస్టులు, 111 వన్డేలు, 46 టీ20లు ఆడి వరుసగా 413, 150, 52 వికెట్లు తీశాడు. టీమ్ఇండియా మహిళా టెస్టు సారథి మిథాలీ రాజ్​ తన 22 ఏళ్ల కెరీర్​లో జట్టుకు ఎంతో సేవ చేసింది. 11 టెస్టులు, 215 వన్డేలు, 89 టీ20లు ఆడి వరుసగా 669, 7170, 2364 పరుగులు చేసింది. కెప్టెన్​గా జట్టుకు ఎన్నో విజయాల్ని అందించింది.

ఖేల్​రత్నకు ఛెత్రీ పేరు

భారతీయ స్టార్ ఫుట్​బాలర్ సునీల్ ఛెత్రీ పేరును ఖేల్​రత్నకు సిఫార్సు చేసింది భారతీయ ఫుట్​బాల్ సమాఖ్య. అయితే ఇందుకు సంబంధించిన పత్రాలను ఇంకా సమర్పించలేదు.

దేశ అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్ గాంధీ ఖేల్​రత్నకు టీమ్ఇండియా ఆటగాళ్లు రవిచంద్రన్ అశ్విన్, మిథాలీ రాజ్​ల పేర్లను బీసీసీఐ సిఫార్సు చేసింది. బుమ్రా, కేఎల్‌.రాహుల్‌, ధావన్‌ పేర్లు అర్జున అవార్డు కోసం ప్రతిపాదించింది.

అశ్విన్ తన కెరీర్​లో 79 టెస్టులు, 111 వన్డేలు, 46 టీ20లు ఆడి వరుసగా 413, 150, 52 వికెట్లు తీశాడు. టీమ్ఇండియా మహిళా టెస్టు సారథి మిథాలీ రాజ్​ తన 22 ఏళ్ల కెరీర్​లో జట్టుకు ఎంతో సేవ చేసింది. 11 టెస్టులు, 215 వన్డేలు, 89 టీ20లు ఆడి వరుసగా 669, 7170, 2364 పరుగులు చేసింది. కెప్టెన్​గా జట్టుకు ఎన్నో విజయాల్ని అందించింది.

ఖేల్​రత్నకు ఛెత్రీ పేరు

భారతీయ స్టార్ ఫుట్​బాలర్ సునీల్ ఛెత్రీ పేరును ఖేల్​రత్నకు సిఫార్సు చేసింది భారతీయ ఫుట్​బాల్ సమాఖ్య. అయితే ఇందుకు సంబంధించిన పత్రాలను ఇంకా సమర్పించలేదు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.