ETV Bharat / sitara

పోర్న్​ చిత్రాలతో కుంద్రా సంపాదన రోజుకు రూ.8 లక్షలు?

ప్రముఖ నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్​ కుంద్రా అశ్లీల చిత్రాలు నిర్మించాడన్న వాదనలు నిజమేనని స్పష్టం చేశారు ముంబయి జాయింట్​ పోలీస్​ కమీష​నర్ మిలింద్. ఈ వ్యాపారం ద్వారా అతడు రోజుకు రూ.7-8 లక్షలు ఆర్జించేవాడని వెల్లడించారు.

author img

By

Published : Jul 21, 2021, 3:38 PM IST

Raj Kundra arrest: Is Shilpa Shetty involved in streaming pornographic content?
పోర్న్​ చిత్రాలతో కుంద్రా సంపాదన రోజుకు రూ.8 లక్షలు?
అశ్లీల చిత్రాల కేసులో వివరాలున

అశ్లీల చిత్రాలకు సంబంధించిన కేసులో అరెస్ట్​ అయిన ప్రముఖ నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్​ కుంద్రా(వియాన్​ ఇండస్ట్రీస్​ అధినేత) గురించి విస్తుపోయే నిజాలను బయటపెట్టారు ముంబయి క్రైమ్​ బ్రాంచ్​ పోలీసులు. అతడితో పాటు అతని చెల్లి భర్త ప్రదీప్​ భక్షి(కెన్రిన్​ కంపెని ఛైర్మన్​)ని కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరు తమ కంపెనీల ద్వారా 'హాట్​షాట్స్​ డిజిటల్​ ఎంటర్​టైనర్'​ పేరుతో ఓ యాప్​ రూపొందించినట్లు తెలిపారు. ఇందులో పోర్న్​ కంటెంట్​ ఉంటుందని వెల్లడించారు.

"కుంద్రా అశ్లీల చిత్రాలు నిర్మిస్తున్నాడని ఈ ఏడాది ఫిబ్రవరిలో కేసు నమోదైంది. అప్పటి నుంచి దర్యాప్తు ప్రారంభించాం. ప్రస్తుతం విచారణలో భాగంగా కుంద్రా నుంచి ఎన్నో హాట్​షాట్​ ఫిల్మ్స్​, వీడియో క్లిప్స్​, వాట్సప్​ చాట్స్​ స్వాధీనం చేసుకున్నాం. సినిమాల్లో అవకాశం కోసం ముంబయికి వచ్చిన నటీమణులను ఆడిషన్స్​ పేరుతో పిలిచి వారిని ఎంపిక చేసుకుంటారు. అనంతరం వారితో సెమీ న్యూడ్​, న్యూడ్​ సన్నీవేశాలంటూ ఆడిషన్స్​ చేస్తారు. కొంతమంది దీన్ని వ్యతిరేకించి పోలీసులను ఆశ్రయించారు. మొదట్లో వారు ఈ వ్యాపారం మొదలుపెట్టినప్పుడు రోజుకు రూ.3-4లక్షలు సంపాదించేవారు. ఆ తర్వాత క్రమంగా లాక్​డౌన్​లో వారి వ్యాపారం వృద్ధి చెందింది. లాక్​డౌన్​లో రోజుకు 7-8 లక్షలు ఆర్జించేవారు."

-మిలింద్​, ముంబయి జాయింట్​ పోలీస్​ కమీష్​నర్​.

అశ్లీల చిత్రాల కేసులో భాగంగా బుల్లితెర నటీమణులైన గెహానా వశిష్ఠ్​(32), యాస్మిన్​ ఆర్​.ఖాన్​(40), మోనూ జోషి(28), ప్రతిభా నలవాడే(33). ఎమ్​.అతీఫ్​ అహ్మద్​(24), దీపాంకర్​ పి. కస్నవీస్​(38), భానూసూర్య ఠాకూర్​(26), తన్వీర్​ హష్మీ(4), ఉమేశ్​ కామత్​(39)లను గతంలోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అయితే అశ్లీల చిత్రాల కేసులో ఇప్పుడు బయట పడిన నిజాలు కొన్నేనని బాలీవుడ్​ వర్గాలు అంటున్నాయి. వినోద రంగంలో ఉంటూ ఇలాంటి ముసుగు పనులు చేస్తున్న వారు చిత్రసీమలో చాలా మంది ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇందులో బాలీవుడ్​కు చెందిన ప్రముఖులు ఉన్నారని ప్రచారం జరుగుతోంది. భారత్​లోని అనేక రహస్య ప్రాంతాలతో పాటు విదేశాలలో సెక్స్​-రేవ్​ పార్టీలు నిర్వహించి అశ్లీల చిత్రాలను రూపొందిస్తున్నారని తెలుస్తోంది. అలా నిర్మించిన నీలి చిత్రాలను ప్రపంచంలోనే అనేక డిజిటల్​ ఫ్లాట్​ఫామ్​లకు లక్షల రూపాయలకు విక్రయిస్తున్నాని సమాచారం.

ఇదీ చూడండి: అశ్లీల చిత్రాల కేసులో శిల్పాశెట్టి భర్త అరెస్ట్​

అశ్లీల చిత్రాల కేసులో వివరాలున

అశ్లీల చిత్రాలకు సంబంధించిన కేసులో అరెస్ట్​ అయిన ప్రముఖ నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్​ కుంద్రా(వియాన్​ ఇండస్ట్రీస్​ అధినేత) గురించి విస్తుపోయే నిజాలను బయటపెట్టారు ముంబయి క్రైమ్​ బ్రాంచ్​ పోలీసులు. అతడితో పాటు అతని చెల్లి భర్త ప్రదీప్​ భక్షి(కెన్రిన్​ కంపెని ఛైర్మన్​)ని కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరు తమ కంపెనీల ద్వారా 'హాట్​షాట్స్​ డిజిటల్​ ఎంటర్​టైనర్'​ పేరుతో ఓ యాప్​ రూపొందించినట్లు తెలిపారు. ఇందులో పోర్న్​ కంటెంట్​ ఉంటుందని వెల్లడించారు.

"కుంద్రా అశ్లీల చిత్రాలు నిర్మిస్తున్నాడని ఈ ఏడాది ఫిబ్రవరిలో కేసు నమోదైంది. అప్పటి నుంచి దర్యాప్తు ప్రారంభించాం. ప్రస్తుతం విచారణలో భాగంగా కుంద్రా నుంచి ఎన్నో హాట్​షాట్​ ఫిల్మ్స్​, వీడియో క్లిప్స్​, వాట్సప్​ చాట్స్​ స్వాధీనం చేసుకున్నాం. సినిమాల్లో అవకాశం కోసం ముంబయికి వచ్చిన నటీమణులను ఆడిషన్స్​ పేరుతో పిలిచి వారిని ఎంపిక చేసుకుంటారు. అనంతరం వారితో సెమీ న్యూడ్​, న్యూడ్​ సన్నీవేశాలంటూ ఆడిషన్స్​ చేస్తారు. కొంతమంది దీన్ని వ్యతిరేకించి పోలీసులను ఆశ్రయించారు. మొదట్లో వారు ఈ వ్యాపారం మొదలుపెట్టినప్పుడు రోజుకు రూ.3-4లక్షలు సంపాదించేవారు. ఆ తర్వాత క్రమంగా లాక్​డౌన్​లో వారి వ్యాపారం వృద్ధి చెందింది. లాక్​డౌన్​లో రోజుకు 7-8 లక్షలు ఆర్జించేవారు."

-మిలింద్​, ముంబయి జాయింట్​ పోలీస్​ కమీష్​నర్​.

అశ్లీల చిత్రాల కేసులో భాగంగా బుల్లితెర నటీమణులైన గెహానా వశిష్ఠ్​(32), యాస్మిన్​ ఆర్​.ఖాన్​(40), మోనూ జోషి(28), ప్రతిభా నలవాడే(33). ఎమ్​.అతీఫ్​ అహ్మద్​(24), దీపాంకర్​ పి. కస్నవీస్​(38), భానూసూర్య ఠాకూర్​(26), తన్వీర్​ హష్మీ(4), ఉమేశ్​ కామత్​(39)లను గతంలోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అయితే అశ్లీల చిత్రాల కేసులో ఇప్పుడు బయట పడిన నిజాలు కొన్నేనని బాలీవుడ్​ వర్గాలు అంటున్నాయి. వినోద రంగంలో ఉంటూ ఇలాంటి ముసుగు పనులు చేస్తున్న వారు చిత్రసీమలో చాలా మంది ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇందులో బాలీవుడ్​కు చెందిన ప్రముఖులు ఉన్నారని ప్రచారం జరుగుతోంది. భారత్​లోని అనేక రహస్య ప్రాంతాలతో పాటు విదేశాలలో సెక్స్​-రేవ్​ పార్టీలు నిర్వహించి అశ్లీల చిత్రాలను రూపొందిస్తున్నారని తెలుస్తోంది. అలా నిర్మించిన నీలి చిత్రాలను ప్రపంచంలోనే అనేక డిజిటల్​ ఫ్లాట్​ఫామ్​లకు లక్షల రూపాయలకు విక్రయిస్తున్నాని సమాచారం.

ఇదీ చూడండి: అశ్లీల చిత్రాల కేసులో శిల్పాశెట్టి భర్త అరెస్ట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.