పవర్స్టార్ పవన్కల్యాణ్ కథానాయకుడిగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'వకీల్సాబ్'. సోమవారం య్యూట్యూబ్లో విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ రికార్డులు బద్దలు కొడుతోంది. తెలుగు చిత్ర పరిశ్రమలో మరే సినిమా ట్రైలర్ సాధించనన్ని రికార్డులను 'వకీల్సాబ్' సృష్టిస్తోంది.
24 గంటల్లో 22.44 మిలియన్ వ్యూస్(రియల్ టైమ్ వ్యూస్)ను దక్కించుని టాలీవుడ్ అత్యధిక వీక్షణలను సొంతం చేసుకున్న ట్రైలర్గా నిలిచిందని చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ తెలిపింది. ఇందుకు సంబంధించిన పోస్టర్ను అభిమానులతో పంచుకుంది. అంతేకాదండోయ్ అతి తక్కువ సమయంలో 1మిలియన్ లైక్స్ను సొంతం చేసుకున్న ట్రైలర్గానూ రికార్డు క్రియేట్ చేసింది.
శ్రుతిహాసన్, నివేదా థామస్, అంజలి, అనన్య, ప్రకాశ్రాజ్ ముఖ్య పాత్రలు పోషించిన చిత్రానికి తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. బాలీవుడ్లో విజయవంతమైన 'పింక్'కి రీమేక్గా రూపొందుతోన్న చిత్రమిది. పవన్ ఇమేజ్ను దృష్టిలో పెట్టుకొని కథలో చాలా మార్పులు చేశారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్ 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: 'ఆచార్య' సాంగ్ ప్రోమో.. నితిన్ 'మాస్ట్రో' గ్లింప్స్