ETV Bharat / jagte-raho

తల్లిదండ్రులు కనిపించడం లేదని పీఎస్​లో ఫిర్యాదు - బాలానగర్​లో తల్లిదండ్రుల మిస్సింగ్

తల్లిదండ్రులు కనిపించడం లేదంటూ బాలానగర్​ పోలీసులకు కుమారుడు ఫిర్యాదు చేశాడు. ఏపీలోని కడపలో జరిగిన వివాహానికి హాజరై ఇంటికి తిరిగి వచ్చాక ఎవరూ లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించాడు.

parents missing in balanagar
తల్లిదండ్రులు కనిపించడం లేదని పీఎస్​లో ఫిర్యాదు
author img

By

Published : Dec 31, 2020, 1:36 PM IST

బాలానగర్​ నుంచి షిరిడి వెళ్లిన తల్లిదండ్రులు ఇంటికి తిరిగి రాలేదని కుమారుడు పోలీసులను ఆశ్రయించాడు. నగరంలోని బాలానగర్​ ఫిరోజ్​ గూడకు చెందిన రమణమ్మ, తిరుమలయ్య ఈనెల 10న ఏపీలోని కడపలో జరిగిన కుమారుడు నాగచైతన్య వివాహానికి హాజరై 12న తిరిగి హైదరాబాద్​ వచ్చారు.

తర్వాత ఈనెల 24న నాగచైతన్య బాలానగర్​ రాగా... తల్లిదండ్రులు ఇంట్లో కనిపించలేదు. వారి ఆచూకీపై స్థానికులను ఆరా తీయగా.. షిరిడి వెళుతున్నట్లు చెప్పారని తెలిపారు. దీంతో తల్లిదండ్రుల జాడ కోసం వెతకగా వారి చరవాణి స్విచ్​ఆఫ్​ చేసి ఉందని పోలీసులకు వివరించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: కన్నా.. అమ్మ లేదని రాదని చెప్పనా!

బాలానగర్​ నుంచి షిరిడి వెళ్లిన తల్లిదండ్రులు ఇంటికి తిరిగి రాలేదని కుమారుడు పోలీసులను ఆశ్రయించాడు. నగరంలోని బాలానగర్​ ఫిరోజ్​ గూడకు చెందిన రమణమ్మ, తిరుమలయ్య ఈనెల 10న ఏపీలోని కడపలో జరిగిన కుమారుడు నాగచైతన్య వివాహానికి హాజరై 12న తిరిగి హైదరాబాద్​ వచ్చారు.

తర్వాత ఈనెల 24న నాగచైతన్య బాలానగర్​ రాగా... తల్లిదండ్రులు ఇంట్లో కనిపించలేదు. వారి ఆచూకీపై స్థానికులను ఆరా తీయగా.. షిరిడి వెళుతున్నట్లు చెప్పారని తెలిపారు. దీంతో తల్లిదండ్రుల జాడ కోసం వెతకగా వారి చరవాణి స్విచ్​ఆఫ్​ చేసి ఉందని పోలీసులకు వివరించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: కన్నా.. అమ్మ లేదని రాదని చెప్పనా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.