అధ్యక్షుడు మెక్రాన్ పదవి నుంచి వైదొలగాలని చేస్తున్న నిరసనలు 12వ వారానికి చేరుకున్నాయి. తాజాగా మరోమారు వందల మంది నిరసనకారులు ఫ్రాన్స్లోని వివిధ నగరాల్లో ఆందోళనలు చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వీధుల్లో ప్రదర్శనలు చేపట్టారు. వారిని చెదరగొట్టడానికి పోలీసులు భాష్పవాయువు ప్రయోగించారు.
నవంబర్ 17, 2018లో మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు 2 వేల మంది గాయపడ్డారని ప్రభుత్వం తెలిపింది. పసుపు జాకెట్ నిరసనలకు సంబంధించిన రోడ్డు ప్రమాదాల్లో 10 మంది మరణించినట్లు వెల్లడించింది.