ETV Bharat / international

మయన్మార్​ ఆందోళన: నిరసనకారులపై బాష్పవాయువు

author img

By

Published : Mar 6, 2021, 1:18 PM IST

మయన్మార్​లో సైనిక తిరుగుబాటుపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఐరాస భద్రతా మండలికి ఆ సంస్థ రాయబారి క్రిస్టినీ షారనర్‌ బర్గ్‌నర్‌ విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో.. ఆందోళనలు మరింత ఉద్ధృతంగా మారాయి. దీంతో నిరసనకారులపై బాష్పవాయువు ప్రయోగించారు పోలీసులు.

Protests, tear gas in Myanmar after UN envoy urges action
ఆ విజ్ఞప్తితో మరింత ఉద్ధృతంగా మయన్మార్​ నిరసనలు

మయన్మార్​లో సైనికపాలనకు వ్యతిరేకం ఆందోళనలు కొనసాగుతున్నాయి. సైనిక తిరుగుబాటుపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి ఐరాస ప్రత్యేక రాయబారి క్రిస్టినీ షారనర్‌ బర్గ్‌నర్‌ విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో నిరసనలు మరింత ఉద్ధృతంగా మారాయి. దీంతో యాంగూన్​ నగరం సహా కచిన్​, దావీ రాష్టాల్లో ఆందోళనకారులపై బాష్పవాయువు ప్రయోగించారు సైనికులు.

మరింత ఉద్ధృతంగా మయన్మార్​ నిరసనలు

మయన్మార్‌ సైన్యం శాంతియుతంగా నిరసన తెలిపిన 50 మంది అమాయకుల ప్రాణాలను తీసిందని ఐరాకు ఫిర్యాదు చేశారు బర్గ్​నర్​. ఇలాంటి ఘటనలకు పాల్పడకుండా సైన్యాన్ని దూరంగా ఉంచేందుకు వీలైనన్ని ఎక్కువ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ క్రమంలో పలు నగరాల్లో నిరసనకారులు ర్యాలీలు నిర్వహించారు.

ఇదీ చూడండి: 'మయన్మార్​ సైన్యంపై తక్షణమే చర్యలు తీసుకోవాలి'

మయన్మార్​లో సైనికపాలనకు వ్యతిరేకం ఆందోళనలు కొనసాగుతున్నాయి. సైనిక తిరుగుబాటుపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి ఐరాస ప్రత్యేక రాయబారి క్రిస్టినీ షారనర్‌ బర్గ్‌నర్‌ విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో నిరసనలు మరింత ఉద్ధృతంగా మారాయి. దీంతో యాంగూన్​ నగరం సహా కచిన్​, దావీ రాష్టాల్లో ఆందోళనకారులపై బాష్పవాయువు ప్రయోగించారు సైనికులు.

మరింత ఉద్ధృతంగా మయన్మార్​ నిరసనలు

మయన్మార్‌ సైన్యం శాంతియుతంగా నిరసన తెలిపిన 50 మంది అమాయకుల ప్రాణాలను తీసిందని ఐరాకు ఫిర్యాదు చేశారు బర్గ్​నర్​. ఇలాంటి ఘటనలకు పాల్పడకుండా సైన్యాన్ని దూరంగా ఉంచేందుకు వీలైనన్ని ఎక్కువ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ క్రమంలో పలు నగరాల్లో నిరసనకారులు ర్యాలీలు నిర్వహించారు.

ఇదీ చూడండి: 'మయన్మార్​ సైన్యంపై తక్షణమే చర్యలు తీసుకోవాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.