ETV Bharat / international

కరోనా వైరస్​ను​ మానవులు సృష్టించలేరు : అమెరికా

author img

By

Published : May 1, 2020, 6:10 AM IST

కరోనా వైరస్​ను చైనా సృష్టించిందన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ వ్యాఖ్యలకు విరుద్ధంగా అగ్రరాజ్య నిఘా సంస్థ ఓ కీలక ప్రకటన విడుదల చేసింది. వైరస్​ మనుషులు రూపొందించింది కాదని తేల్చి చెప్పింది. అయితే వైరస్​ పుట్టుకకు చైనా వుహాన్​ ల్యాబ్​తో సంబంధం ఉందా? లేదా? అనే విషయాన్ని పరిశీలిస్తున్నట్టు పేర్కొంది.

US intel: Coronavirus not manmade, still studying lab theory
'వైరస్​ మనుషులు సృష్టి కాదు.. కానీ'

కరోనా వైరస్​ మనుషుల సృష్టి కాదని అమెరికా నిఘా సంస్థలు తేల్చి చెప్పాయి. జన్యుమార్పిడితో కూడా కరోనా వైరస్​ సంభవించలేదని స్పష్టం చేశాయి. అయితే వైరస్​ పుట్టుకపై పరిశోధనలు జరుపుతున్నట్టు పేర్కొన్నాయి. వైరస్​తో చైనాలోని వుహాన్​ ల్యాబ్​కు సంబంధం ఉందా? లేక జంతువుల నుంచి వచ్చిందా అన్న ప్రశ్నలకు సమాధానం వెతుకుతున్నట్టు తెలిపాయి. ఈ మేరకు జాతీయ నిఘా వ్యవస్థ డైరక్టర్​ కార్యాలయం ఓ ప్రకటనను విడుదల చేసింది.

"విస్తృత శాస్త్రీయ పరిశోధనల అనంతరం కరోనా వైరస్​ను మనుషులు రూపొందించలేరని, జన్యు మార్పిడితో సంభవించలేదని నిఘా సంఘాలు ఓ అంగీకారానికి వచ్చాయి. అయితే అప్పటికే వైరస్​ సోకిన జంతువుల నుంచి మనిషికి వ్యాపించిందా? లేదా వుహాన్​ ల్యాబొరేటరీలో జరిగిన ఓ ప్రమాదంలో ఇది సంభవించిందా? అనే ప్రశ్నలకు సమాధానాల కోసం నిఘా సంఘాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి."

--- అమెరికా జాతీయ నిఘా సంస్థ ప్రకటన.

ట్రంప్ వాదన వేరే..

వుహాన్​లోని ల్యాబ్​లోనే కరోనా వైరస్​ను సృష్టించారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ ఆరోపిస్తున్న తరుణంలో నిఘా వ్యవస్థలు ఈ ప్రకటన చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. వైరస్​పై అనేక విషయాలను చైనా దాటిపెట్టిందని ఆరోపించారు ట్రంప్​.

ట్రంప్​, ఆయన సహచరులు ఎన్ని ఆరోపణలు చేసినా.. ఓ గబ్బిలం నుంచే వైరస్​ వ్యాపించిందని శాస్త్రవేత్తలు విశ్వసిస్తున్నారు.

ట్రంప్​ ఆరోపణలను చైనా ఎప్పటికప్పుడు తిప్పికొడుతోంది. సొంత వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం, రాజకీయ లబ్ధిపొందడం కోసం ట్రంప్​ ఈ ఆరోపణలు చేస్తున్నట్టు మండిపడుతూనే ఉంది.

కరోనా వైరస్​ మనుషుల సృష్టి కాదని అమెరికా నిఘా సంస్థలు తేల్చి చెప్పాయి. జన్యుమార్పిడితో కూడా కరోనా వైరస్​ సంభవించలేదని స్పష్టం చేశాయి. అయితే వైరస్​ పుట్టుకపై పరిశోధనలు జరుపుతున్నట్టు పేర్కొన్నాయి. వైరస్​తో చైనాలోని వుహాన్​ ల్యాబ్​కు సంబంధం ఉందా? లేక జంతువుల నుంచి వచ్చిందా అన్న ప్రశ్నలకు సమాధానం వెతుకుతున్నట్టు తెలిపాయి. ఈ మేరకు జాతీయ నిఘా వ్యవస్థ డైరక్టర్​ కార్యాలయం ఓ ప్రకటనను విడుదల చేసింది.

"విస్తృత శాస్త్రీయ పరిశోధనల అనంతరం కరోనా వైరస్​ను మనుషులు రూపొందించలేరని, జన్యు మార్పిడితో సంభవించలేదని నిఘా సంఘాలు ఓ అంగీకారానికి వచ్చాయి. అయితే అప్పటికే వైరస్​ సోకిన జంతువుల నుంచి మనిషికి వ్యాపించిందా? లేదా వుహాన్​ ల్యాబొరేటరీలో జరిగిన ఓ ప్రమాదంలో ఇది సంభవించిందా? అనే ప్రశ్నలకు సమాధానాల కోసం నిఘా సంఘాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి."

--- అమెరికా జాతీయ నిఘా సంస్థ ప్రకటన.

ట్రంప్ వాదన వేరే..

వుహాన్​లోని ల్యాబ్​లోనే కరోనా వైరస్​ను సృష్టించారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ ఆరోపిస్తున్న తరుణంలో నిఘా వ్యవస్థలు ఈ ప్రకటన చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. వైరస్​పై అనేక విషయాలను చైనా దాటిపెట్టిందని ఆరోపించారు ట్రంప్​.

ట్రంప్​, ఆయన సహచరులు ఎన్ని ఆరోపణలు చేసినా.. ఓ గబ్బిలం నుంచే వైరస్​ వ్యాపించిందని శాస్త్రవేత్తలు విశ్వసిస్తున్నారు.

ట్రంప్​ ఆరోపణలను చైనా ఎప్పటికప్పుడు తిప్పికొడుతోంది. సొంత వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం, రాజకీయ లబ్ధిపొందడం కోసం ట్రంప్​ ఈ ఆరోపణలు చేస్తున్నట్టు మండిపడుతూనే ఉంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.