భారత్.. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ఎన్నికల ప్రక్రియ కూడా అత్యంత క్లిష్టమైనది. ప్రపంచ దేశాలు ఆసక్తిగా తిలకించే భారత సార్వత్రిక సమరం ట్విట్టర్లోనూ రికార్డులు నమోదు చేసింది. నెల రోజుల వ్యవధిలో ఎన్నికల ప్రస్తావనతో 4.56 కోట్ల ట్వీట్లు నమోదయ్యాయని ట్విట్టర్ యాజమాన్యం తెలిపింది.
ఎన్నికల విషయంలో ఎక్కువగా చర్చించిన అంశంగా జాతీయ భద్రత నిలిచింది. ఆ తర్వాత మతం, ఉద్యోగాలు, వ్యవసాయం, పన్నులు, వాణిజ్యం లాంటి అంశాలపైనా ఎక్కువగా చర్చించుకున్నారు. వ్యక్తుల విషయంలో ప్రధాని నరేంద్రమోదీ మొదటి స్థానంలో ఉన్నారని ట్విట్టర్ ఓ ప్రకటనలో తెలిపింది.
"తొలి దశ ఎన్నికల్లో భాగంగా 18 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 91 లోక్సభ స్థానాలకు గురువారం పోలింగ్ జరిగింది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి ఇప్పటివరకు 4.56 కోట్ల ట్వీట్లు నమోదయ్యాయి. ఇందులో గురువారం ఒక్కరోజే 12 లక్షల ట్వీట్లు నమోదయ్యాయి. "
-ట్విట్టర్
ట్విట్టర్ వేదికగా రాజకీయ పార్టీలు, నాయకులు ప్రజలకు చేరువయ్యారు. మోదీ తర్వాతి స్థానంలో ప్రముఖ నేతలు అమిత్షా, యోగి ఆదిత్యనాథ్, రాహుల్గాంధీ, ప్రియాంక గాంధీ నిలిచారు.
ఇదీ చూడండి: అగ్రస్థానంలో బంగాల్... చివర్లో బిహార్!