ETV Bharat / elections

ట్విట్టర్​లో ఎన్నికల హవా.. మోదీనే టాప్

భారత్​లో సార్వత్రిక సమరం ట్విట్టర్​లోనూ వేడి పుట్టించింది. నెల రోజులుగా ఎన్నికల ప్రస్తావనతో 4.56 కోట్ల ట్వీట్​లు నమోదయ్యాయి. జాతీయ భద్రతపై ఎక్కువ మంది మాట్లాడుకోగా.. నాయకుల్లో ప్రధాని నరేంద్రమోదీ గురించే అత్యధికులు చర్చించారని ట్విట్టర్​ యాజమాన్యం తెలిపింది.

author img

By

Published : Apr 12, 2019, 1:21 AM IST

Updated : Apr 12, 2019, 8:19 AM IST

ట్విట్టర్​లో ఎన్నికల హవా.. మోదీనే టాప్
ట్విట్టర్​లో ఎన్నికల హవా.. మోదీనే టాప్

భారత్​.. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ఎన్నికల ప్రక్రియ కూడా అత్యంత క్లిష్టమైనది. ప్రపంచ దేశాలు ఆసక్తిగా తిలకించే భారత సార్వత్రిక సమరం ట్విట్టర్​లోనూ రికార్డులు నమోదు చేసింది. నెల రోజుల వ్యవధిలో ఎన్నికల ప్రస్తావనతో 4.56 కోట్ల ట్వీట్లు నమోదయ్యాయని ట్విట్టర్​ యాజమాన్యం తెలిపింది.

ఎన్నికల విషయంలో ఎక్కువగా చర్చించిన అంశంగా జాతీయ భద్రత నిలిచింది. ఆ తర్వాత మతం, ఉద్యోగాలు, వ్యవసాయం, పన్నులు, వాణిజ్యం లాంటి అంశాలపైనా ఎక్కువగా చర్చించుకున్నారు. వ్యక్తుల విషయంలో ప్రధాని నరేంద్రమోదీ మొదటి స్థానంలో ఉన్నారని ట్విట్టర్ ఓ ప్రకటనలో తెలిపింది.

"తొలి దశ ఎన్నికల్లో భాగంగా 18 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 91 లోక్​సభ స్థానాలకు గురువారం పోలింగ్​ జరిగింది. ఎన్నికల నోటిఫికేషన్​ విడుదలైనప్పటి నుంచి ఇప్పటివరకు 4.56 కోట్ల​ ట్వీట్లు నమోదయ్యాయి. ఇందులో గురువారం ఒక్కరోజే 12 లక్షల ట్వీట్లు నమోదయ్యాయి. "
-ట్విట్టర్

ట్విట్టర్​ వేదికగా రాజకీయ పార్టీలు, నాయకులు ప్రజలకు చేరువయ్యారు. మోదీ తర్వాతి స్థానంలో ప్రముఖ నేతలు అమిత్​షా, యోగి ఆదిత్యనాథ్, రాహుల్​గాంధీ, ప్రియాంక గాంధీ నిలిచారు.

ఇదీ చూడండి: అగ్రస్థానంలో బంగాల్​... చివర్లో బిహార్!

ట్విట్టర్​లో ఎన్నికల హవా.. మోదీనే టాప్

భారత్​.. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ఎన్నికల ప్రక్రియ కూడా అత్యంత క్లిష్టమైనది. ప్రపంచ దేశాలు ఆసక్తిగా తిలకించే భారత సార్వత్రిక సమరం ట్విట్టర్​లోనూ రికార్డులు నమోదు చేసింది. నెల రోజుల వ్యవధిలో ఎన్నికల ప్రస్తావనతో 4.56 కోట్ల ట్వీట్లు నమోదయ్యాయని ట్విట్టర్​ యాజమాన్యం తెలిపింది.

ఎన్నికల విషయంలో ఎక్కువగా చర్చించిన అంశంగా జాతీయ భద్రత నిలిచింది. ఆ తర్వాత మతం, ఉద్యోగాలు, వ్యవసాయం, పన్నులు, వాణిజ్యం లాంటి అంశాలపైనా ఎక్కువగా చర్చించుకున్నారు. వ్యక్తుల విషయంలో ప్రధాని నరేంద్రమోదీ మొదటి స్థానంలో ఉన్నారని ట్విట్టర్ ఓ ప్రకటనలో తెలిపింది.

"తొలి దశ ఎన్నికల్లో భాగంగా 18 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 91 లోక్​సభ స్థానాలకు గురువారం పోలింగ్​ జరిగింది. ఎన్నికల నోటిఫికేషన్​ విడుదలైనప్పటి నుంచి ఇప్పటివరకు 4.56 కోట్ల​ ట్వీట్లు నమోదయ్యాయి. ఇందులో గురువారం ఒక్కరోజే 12 లక్షల ట్వీట్లు నమోదయ్యాయి. "
-ట్విట్టర్

ట్విట్టర్​ వేదికగా రాజకీయ పార్టీలు, నాయకులు ప్రజలకు చేరువయ్యారు. మోదీ తర్వాతి స్థానంలో ప్రముఖ నేతలు అమిత్​షా, యోగి ఆదిత్యనాథ్, రాహుల్​గాంధీ, ప్రియాంక గాంధీ నిలిచారు.

ఇదీ చూడండి: అగ్రస్థానంలో బంగాల్​... చివర్లో బిహార్!

AP Video Delivery Log - 1800 GMT Horizons
Thursday, 11 April, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 24 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1527: HZ Russia Arctic Tourism AP Clients Only 4205582
Tourism growth high on agenda at Arctic Forum
AP-APTN-1429: HZ UK Parkinson's Discrimination No access by BBC, ITN (Including Channel 4 And 5), Al Jazeera, Bloomberg 4205565
New report shows Parkinson's patients face prejudice and abuse
AP-APTN-1153: HZ Italy Theresa May Jewellery AP Clients Only 4203200
The European jeweller backing Britain's Brexit PM's style +REPLAY+
AP-APTN-1103: HZ UK Royal Births AP Clients Only 4195915
Famous birthplaces of British royal family +REPLAY W/ UPDATED SCRIPT +
AP-APTN-1050: HZ Germany Games AP Clients Only 4205501
Quirky video games on show in Berlin
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Apr 12, 2019, 8:19 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.