ETV Bharat / crime

Accident: బైక్​ను ఢీకొన్న లారీ.. యువకుడు మృతి - సంగారెడ్డి పారిశ్రామిక వాడ

సంగారెడ్డి జిల్లా పాశమైలారంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన ఓ లారీ.. బైక్​ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.

Larry collides with bike
రోడ్డు ప్రమాదం
author img

By

Published : May 31, 2021, 8:04 PM IST

అతివేగం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంటే.. మరొకరు కోమాలోకి వెళ్లేలా చేసింది. సంగారెడ్డి జిల్లా పాశమైలారంలో.. వేగంగా వచ్చిన ఓ లారీ, ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్​పై ఉన్న మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.

ఇస్నాపూర్​కు చెందిన జలీల్, రంజాన్​లు.. పారిశ్రామికవాడ వైపునకు వస్తోన్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. తీవ్ర గాయాల పాలైన రంజాన్​ను ఆసుపత్రికి తరలించగా.. వైద్యులు అతడు కోమాలోకి వెళ్లినట్లుగా నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.

అతివేగం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంటే.. మరొకరు కోమాలోకి వెళ్లేలా చేసింది. సంగారెడ్డి జిల్లా పాశమైలారంలో.. వేగంగా వచ్చిన ఓ లారీ, ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్​పై ఉన్న మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.

ఇస్నాపూర్​కు చెందిన జలీల్, రంజాన్​లు.. పారిశ్రామికవాడ వైపునకు వస్తోన్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. తీవ్ర గాయాల పాలైన రంజాన్​ను ఆసుపత్రికి తరలించగా.. వైద్యులు అతడు కోమాలోకి వెళ్లినట్లుగా నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.

ఇదీ చదవండి: attack with knife: ప్రేమించలేదని ఉన్మాదం.. యువతిపై కత్తితో దాడికి యత్నం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.