నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బైక్ను అంబులెన్స్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. నగరంలోని కోర్టు చౌరస్తా వద్ద ఓ కరోనా పాజిటివ్ డెడ్ బాడీని తీసుకెళ్లేందుకు వేగంగా వెళ్తుతున్న అంబులెన్స్ బైక్ను ఢీకొట్టింది.
అంబులెన్స్ డ్రైవర్తో పాటు, బైక్పై వెళ్తున్న ఇద్దరిలో డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. ఇరువురిని చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో అంబులెన్స్ ముందు భాగం ధ్వంసమైంది.
ఇదీ చదవండి: గ్లాసు గుర్తు కోల్పోయిన జనసేన