ETV Bharat / city

'ఉద్యోగుల శ్రమతో విద్యుత్ మిగులు రాష్ట్రంగా తెలంగాణ' - విద్యుత్ ఉద్యోగుల సంఘం సమావేశానికి హాజరైన కేటీఆర్​

రాష్ట్రావతరణ అనంతరం తొలి ప్రాధాన్యతగా విద్యుత్ సమస్యను పరిష్కరించినట్టు... కేటీఆర్​ అన్నారు. విద్యుత్ కార్మిక సంఘం సమావేశానికి హాజరైన మంత్రి... ప్రత్యేక ఉద్యమంలో విద్యుత్ ఉద్యోగులు కీలకపాత్ర పోషించారని కొనియాడారు.

trs working president ktr attend to state electricity employes union meeting in telangana bhavan
ఉచిత విద్యుత్​తో ధాన్యాగారంగా రాష్ట్రం: కేటీఆర్​
author img

By

Published : Jan 28, 2021, 3:59 PM IST

తెలంగాణ ఉద్యమంలో విద్యుత్ ఉద్యోగులు కీలకపాత్ర పోషించారని... తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ అన్నారు. తెలంగాణ భవన్​లో విద్యుత్ కార్మిక సంఘం సమావేశానికి... విద్యుత్​శాఖ మంత్రి జగదీశ్ రెడ్డితో కలిసి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విద్యుత్​శాఖలోని ఆర్టిజన్స్​ ఉద్యోగులను తెరాస ప్రభుత్వం రెగ్యలర్​ చేసిందని తెలిపారు.

ఉమ్మడి రాష్ట్రాంలో విద్యుత్​ కష్టాలు ఎలా ఉండేవో అందిరికీ తెలిసిందేనని కేటీఆర్​ వ్యాఖ్యానించారు. అప్పట్లో పరిశ్రమలకు వారంలో మూడు రోజులు పవర్​ హాలిడే ఉండేదని గుర్తుచేశారు. కానీ ప్రస్తుతం విద్యుత్​ వినియోగంలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉందన్నారు. తెంలగాణకు రావాల్సిన జలవిద్యుత్ కేంద్రాన్ని విభజన సమయంలో ఏపీలో కలిపారని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం తర్వాత... తెరాస అధికారంలోకి రాగానే తొలి ప్రాధాన్యతగా విద్యుత్​ సమస్యనే పరిష్కరించినట్టు పేర్కొన్నారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్​ ఇస్తున్న ఏకైక రాష్ట్రంగా... దేశంలోనే ఘనత సాధించామన్నారు. దీంతో వ్యవసాయంలో అధిక దిగుబడులు సాధిస్తూ... దేశానికే ధాన్యాగారంగా మారిందని పేర్కొన్నారు. వందశాతం ఇంటింటికి మంచినీరు అందిస్తున్న రాష్ట్రంగా కేంద్రం ప్రకటించడం గర్వకారణం అన్నారు.

ఇదీ చూడండి: వారణాసి పర్యటనలో సీఎం కేసీఆర్​ కుటుంబం

తెలంగాణ ఉద్యమంలో విద్యుత్ ఉద్యోగులు కీలకపాత్ర పోషించారని... తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ అన్నారు. తెలంగాణ భవన్​లో విద్యుత్ కార్మిక సంఘం సమావేశానికి... విద్యుత్​శాఖ మంత్రి జగదీశ్ రెడ్డితో కలిసి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విద్యుత్​శాఖలోని ఆర్టిజన్స్​ ఉద్యోగులను తెరాస ప్రభుత్వం రెగ్యలర్​ చేసిందని తెలిపారు.

ఉమ్మడి రాష్ట్రాంలో విద్యుత్​ కష్టాలు ఎలా ఉండేవో అందిరికీ తెలిసిందేనని కేటీఆర్​ వ్యాఖ్యానించారు. అప్పట్లో పరిశ్రమలకు వారంలో మూడు రోజులు పవర్​ హాలిడే ఉండేదని గుర్తుచేశారు. కానీ ప్రస్తుతం విద్యుత్​ వినియోగంలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉందన్నారు. తెంలగాణకు రావాల్సిన జలవిద్యుత్ కేంద్రాన్ని విభజన సమయంలో ఏపీలో కలిపారని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం తర్వాత... తెరాస అధికారంలోకి రాగానే తొలి ప్రాధాన్యతగా విద్యుత్​ సమస్యనే పరిష్కరించినట్టు పేర్కొన్నారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్​ ఇస్తున్న ఏకైక రాష్ట్రంగా... దేశంలోనే ఘనత సాధించామన్నారు. దీంతో వ్యవసాయంలో అధిక దిగుబడులు సాధిస్తూ... దేశానికే ధాన్యాగారంగా మారిందని పేర్కొన్నారు. వందశాతం ఇంటింటికి మంచినీరు అందిస్తున్న రాష్ట్రంగా కేంద్రం ప్రకటించడం గర్వకారణం అన్నారు.

ఇదీ చూడండి: వారణాసి పర్యటనలో సీఎం కేసీఆర్​ కుటుంబం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.