KTR Comments about Cantonment Development: కంటోన్మెంట్ అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టంచేశారు. పేదలకు పట్టాలు ఇద్దామంటే స్థలం ఇవ్వకుండా కేంద్రం అడ్డుపడుతోందని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గనిర్దేశంలో రాష్ట్రం అన్ని విధాలుగా ముందుకు సాగుతోందని పురపాలకమంత్రి కేటీఆర్ అన్నారు. కంటోన్మెంట్లో ఉచిత మంచి నీటి పథకం అమలు చేస్తున్నామని తెలిపారు. రోడ్లు, నాలాలు అభివృద్ధి చేద్దామన్నా కేంద్రం సహకరించట్లేదని మండిపడ్డారు. రాజకీయ లబ్ధికోసం ప్రజల ప్రయోజనాలకు అడ్డుపడొద్దని కోరారు.
దయచేసి అడ్డుపడొద్దు..
KTR Comments Comments on Central Govt : 'కంటోన్మెంట్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంటే.. ప్రగతికి అడుగులు పడకుండా అడుగడుగునా కేంద్రం అడ్డుపడుతోంది. కంటోన్మెంట్ రోడ్లను మూసివేయడం.. పేదలకు పట్టాలు ఇవ్వకుండా అడ్డుకోవడం.. స్కై వేకు అనుమతులు ఇవ్వకపోవడం.. ఇలా ప్రతి పనికి అడ్డువస్తోంది. మీరు అనుమతి ఇవ్వకపోయినా మా పోరాటం ఆగదు. మా ప్రగతి ఆగదు. రాష్ట్ర సర్కార్ నుంచి ఏ మేరకు అభివృద్ధి సాధ్యమవుతుందో.. పక్కాగా అది చేస్తాం. కొన్ని వందల సార్లు విజ్ఞప్తి చేశాం. కంటోన్మెంట్ ప్రజల తరఫున మరోసారి కోరుతున్నాం. దయచేసి రాజకీయ లబ్ధికోసం ప్రజల ప్రయోజనాలకు అడ్డుపడొద్దు.'
- కేటీఆర్, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి