ETV Bharat / business

'ఫిబ్రవరిలో 12.37లక్షల మందికి ఉద్యోగాలు'

author img

By

Published : Apr 21, 2021, 7:15 AM IST

2021 ఫిబ్రవరిలో ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ పేరోల్​లో కొత్తగా 13.36 లక్షల మంది చందాదారులు చేరారని కేంద్రం తెలిపింది. 2020 ఫిబ్రవరితో పోలిస్తే ఈ సంఖ్య 3.52 శాతం పెరిగినట్లు చెప్పింది.

EPFO data
ఫిబ్రవరిలో 12.37లక్షల మందికి ఉద్యోగాలు: ఈపీఎఫ్​ఓ

2021 ఫిబ్రవరిలో ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్​ఓ) పేరోల్​లో​ కొత్త చేరికలు భారీగా పెరిగాయి. గతేడాది ఇదే నెలతో పోలిస్తే దాదాపు 20 శాతం పెరిగి.. కొత్తగా 12.37 లక్షల మంది చేరారు. ఈ మేరకు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ మంగళవారం విడుదల చేసిన ఈపీఎఫ్​ఓ పేరోల్​ డేటాలో వెల్లడైంది.

పేరోల్​ డేటాలోని కీలకాంశాలు..

  • 2021 జనవరి నుంచి 2021 ఫిబ్రవరి వరకు ఈపీఎఫ్​లో కొత్త చందాదారులు 3.52 శాతం పెరిగారు.
  • 2020 ఫిబ్రవరితో పోలిస్తే.. 2021 ఫిబ్రవరిలో కొత్త చందాదారుల సంఖ్య 19.63 శాతం పెరిగింది.
  • కొవిడ్​ మహమ్మారి కొనసాగుతున్నప్పటికీ.. 2020-21 ఆర్థిక సంవత్సరంలో(ఫిబ్రవరి నాటికి) నికర చందాదారుల సంఖ్య 69.58 లక్షలకు చేరింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఇది 78.58 లక్షలుగా ఉంది. అంతకుముందు సంవత్సరంలో ఈ సంఖ్య 61.12 లక్షలుగా ఉంది.
  • 2021 ఫిబ్రవరిలో కొత్తగా చేరిన వారిలో 22-25 సంవత్సరాల వారే అత్యధికం. నికర చందాదారుల్లో వీరి సంఖ్య 3.29 లక్షలుగా ఉంది.
  • దేశవ్యాప్తంగా చూస్తే.. నికర ఈపీఎఫ్​ చందాదారులలో మహరాష్ట్ర, హరియాణా, గుజరాత్​, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు ముందు వరుసలో ఉన్నాయి. మొత్తం చందాదారుల్లో ఈ రాష్ట్రాల నుంచి 38.14 లక్షల మంది(54.81 శాతం) మంది ఉన్నారు.

ఇదీ చూడండి: చేసే పనులు వింత- శాలరీ ఊహించనంత!

ఇదీ చూడండి: మోటో నుంచి రెండు కొత్త ఫోన్లు- ధర, ఫీచర్లు ఇవే..

2021 ఫిబ్రవరిలో ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్​ఓ) పేరోల్​లో​ కొత్త చేరికలు భారీగా పెరిగాయి. గతేడాది ఇదే నెలతో పోలిస్తే దాదాపు 20 శాతం పెరిగి.. కొత్తగా 12.37 లక్షల మంది చేరారు. ఈ మేరకు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ మంగళవారం విడుదల చేసిన ఈపీఎఫ్​ఓ పేరోల్​ డేటాలో వెల్లడైంది.

పేరోల్​ డేటాలోని కీలకాంశాలు..

  • 2021 జనవరి నుంచి 2021 ఫిబ్రవరి వరకు ఈపీఎఫ్​లో కొత్త చందాదారులు 3.52 శాతం పెరిగారు.
  • 2020 ఫిబ్రవరితో పోలిస్తే.. 2021 ఫిబ్రవరిలో కొత్త చందాదారుల సంఖ్య 19.63 శాతం పెరిగింది.
  • కొవిడ్​ మహమ్మారి కొనసాగుతున్నప్పటికీ.. 2020-21 ఆర్థిక సంవత్సరంలో(ఫిబ్రవరి నాటికి) నికర చందాదారుల సంఖ్య 69.58 లక్షలకు చేరింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఇది 78.58 లక్షలుగా ఉంది. అంతకుముందు సంవత్సరంలో ఈ సంఖ్య 61.12 లక్షలుగా ఉంది.
  • 2021 ఫిబ్రవరిలో కొత్తగా చేరిన వారిలో 22-25 సంవత్సరాల వారే అత్యధికం. నికర చందాదారుల్లో వీరి సంఖ్య 3.29 లక్షలుగా ఉంది.
  • దేశవ్యాప్తంగా చూస్తే.. నికర ఈపీఎఫ్​ చందాదారులలో మహరాష్ట్ర, హరియాణా, గుజరాత్​, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు ముందు వరుసలో ఉన్నాయి. మొత్తం చందాదారుల్లో ఈ రాష్ట్రాల నుంచి 38.14 లక్షల మంది(54.81 శాతం) మంది ఉన్నారు.

ఇదీ చూడండి: చేసే పనులు వింత- శాలరీ ఊహించనంత!

ఇదీ చూడండి: మోటో నుంచి రెండు కొత్త ఫోన్లు- ధర, ఫీచర్లు ఇవే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.