ETV Bharat / business

దేశంలో 5, 4 స్టార్ ఏసీల వినియోగం 14శాతమే!

author img

By

Published : Sep 30, 2020, 3:40 PM IST

విద్యుత్ ఆదా చేసే స్టార్ లేబులింగ్ విధానం గురించి దేశంలో 93 శాతం మందికి అవగాహన ఉన్నప్పటికీ.. 14 శాతం మంది మాత్రమే అధిక రేటింగ్ ఉన్న ఏసీలను వినియోగిస్తున్నట్లు ఓ సర్వేలో తేలింది. ఎక్కువ స్టార్ రేటింగ్ ఏసీల ధరలు అధికంగా ఉండటం వల్ల.. చాలా మంది తక్కువ స్టార్ రేటింగ్ ఉన్నవాటినే వినియోగిస్తున్నట్లు ఆ నివేదిక పేర్కొంది. టైర్​-2 పట్టణాల్లో 400 కుటుంబాలపై జరిపిన ఈ అధ్యాయనంలోని మరిన్ని విషయాలు ఇలా ఉన్నాయి.

Consumer interest in low star rating ACs
దేశంలో 14 శాతమే 5 స్టార్ ఏసీల వినియోగం

దేశంలో 14 శాతం కుటుంబాలు మాత్రమే విద్యుత్ ఆదా చేసే 5 లేదా 4 స్టార్ ఏసీలను వినియోగిస్తున్నట్లు ఓ సర్వేలో తేలింది. కౌన్సిల్​ ఆన్​ ఎనర్జీ, ఎన్విరాన్​మెంట్ అండ్ వాటర్ (సీఈఈడబ్ల్యూ) ఈ సర్వే నిర్వహించాయి.

ఇందులో టైర్-2 పట్టణాల్లో 93 శాతం మంది కుటుంబాలకు స్టార్ లేబులింగ్ విధానం గురించి అవగాహన ఉన్నట్లు తేలింది. అయినప్పటికీ..14 శాతం మాత్రమే 5 లేదా 4 స్టార్ ఏసీలను కొనుగోలు చేశారని తేలింది. 75 శాతం మంది ఎక్కువ రేటింగ్ ఉన్న ఏసీ కొనుగోలు చేయాలనుకున్నా.. వారిని అధిక ధరలు ప్రధానంగా అడ్డుకుంటున్నట్లు సర్వే వెల్లడించింది.

ఈ నివేదిక ఆధారంగా ర్యాండమ్ కంట్రోల్ ట్రయల్స్ (ఆర్​సీటీ) ప్రయోగాల ద్వారా ఎక్కువ రేటింగ్ ఉన్న విక్రయాలు పెరిగేందుకు పలు సూచనలు చేశారు విశ్లేషకులు. జీఎస్​టీ 28 శాతం నుంచి 5 శాతం కన్నా దిగువకు తగ్గించడం ద్వారా.. తక్కువ రేటింగ్ ఉన్న ఏసీలతో పోటీగా 5 లేదా 4 స్టార్ ఏసీల విక్రయాలు పెరుగుతాయని అభిప్రాయయం వక్తం చేశారు.

ధన్​బాద్, మదురై, మీరఠ్, వడోదర పట్టణాల్లో.. 400లకుపైగా కుటుంబాలపై ఈ అధ్యయనాలు జరిగాయి.

జీఎస్​టీ తగ్గించడం ద్వారా తక్కువ రేటింగ్ ఉన్న ఏసీలు, ఎక్కువ రేటింగ్ ఉన్న ఎసీల మధ్య పోటీ పెరగటం సహా.. పరిశ్రమలో ఫినాన్సింగ్ పథకానికి అవకాశం లభిస్తుందని నిపుణులు అంటున్నారు.

ఎక్కువ మంది 5 స్టార్​, 4 స్టార్​ ఏసీలను కొనుగోలు చేస్తే.. గ్రీన్ హౌజ్ గ్యాస్ ఉద్గారాలు తగ్గుతాయని సీఈఈడబ్ల్యూ అభిప్రాయపడింది.

సర్వేలో తేలిన మరిన్ని విషయాలు..

  • మూడో వంతు కుటుంబాలు మాత్రమే సర్వీసింగ్, నిర్వహణకు.. ఇంధన సామర్థ్యంతో సంబంధం ఉందని భావిస్తున్నారు.
  • 71 శాతం కుటుంబాలు సర్వీసింగ్ కోసం 1-1.5 గంటల కన్నా ఎక్కువ సమయం కేటాయించేందుకు ఇష్టపడటం లేదు.
  • 24 శాతం కుటుంబాలు రూ.300 కన్నా తక్కువ మొత్తాన్నే సర్వీసింగ్ కోసం కేటాయిస్తున్నారు.
  • 26 శాతం మంది మాత్రమే ఏసీ సర్వీసింగ్​తో విద్యుత్ వినియోగంపై ప్రత్యక్షంగా ప్రభావం పడుతుందని భావిస్తున్నారు.

ఇదీ చూడండి:రిలయన్స్​లో మరో సంస్థ భారీ పెట్టుబడి

దేశంలో 14 శాతం కుటుంబాలు మాత్రమే విద్యుత్ ఆదా చేసే 5 లేదా 4 స్టార్ ఏసీలను వినియోగిస్తున్నట్లు ఓ సర్వేలో తేలింది. కౌన్సిల్​ ఆన్​ ఎనర్జీ, ఎన్విరాన్​మెంట్ అండ్ వాటర్ (సీఈఈడబ్ల్యూ) ఈ సర్వే నిర్వహించాయి.

ఇందులో టైర్-2 పట్టణాల్లో 93 శాతం మంది కుటుంబాలకు స్టార్ లేబులింగ్ విధానం గురించి అవగాహన ఉన్నట్లు తేలింది. అయినప్పటికీ..14 శాతం మాత్రమే 5 లేదా 4 స్టార్ ఏసీలను కొనుగోలు చేశారని తేలింది. 75 శాతం మంది ఎక్కువ రేటింగ్ ఉన్న ఏసీ కొనుగోలు చేయాలనుకున్నా.. వారిని అధిక ధరలు ప్రధానంగా అడ్డుకుంటున్నట్లు సర్వే వెల్లడించింది.

ఈ నివేదిక ఆధారంగా ర్యాండమ్ కంట్రోల్ ట్రయల్స్ (ఆర్​సీటీ) ప్రయోగాల ద్వారా ఎక్కువ రేటింగ్ ఉన్న విక్రయాలు పెరిగేందుకు పలు సూచనలు చేశారు విశ్లేషకులు. జీఎస్​టీ 28 శాతం నుంచి 5 శాతం కన్నా దిగువకు తగ్గించడం ద్వారా.. తక్కువ రేటింగ్ ఉన్న ఏసీలతో పోటీగా 5 లేదా 4 స్టార్ ఏసీల విక్రయాలు పెరుగుతాయని అభిప్రాయయం వక్తం చేశారు.

ధన్​బాద్, మదురై, మీరఠ్, వడోదర పట్టణాల్లో.. 400లకుపైగా కుటుంబాలపై ఈ అధ్యయనాలు జరిగాయి.

జీఎస్​టీ తగ్గించడం ద్వారా తక్కువ రేటింగ్ ఉన్న ఏసీలు, ఎక్కువ రేటింగ్ ఉన్న ఎసీల మధ్య పోటీ పెరగటం సహా.. పరిశ్రమలో ఫినాన్సింగ్ పథకానికి అవకాశం లభిస్తుందని నిపుణులు అంటున్నారు.

ఎక్కువ మంది 5 స్టార్​, 4 స్టార్​ ఏసీలను కొనుగోలు చేస్తే.. గ్రీన్ హౌజ్ గ్యాస్ ఉద్గారాలు తగ్గుతాయని సీఈఈడబ్ల్యూ అభిప్రాయపడింది.

సర్వేలో తేలిన మరిన్ని విషయాలు..

  • మూడో వంతు కుటుంబాలు మాత్రమే సర్వీసింగ్, నిర్వహణకు.. ఇంధన సామర్థ్యంతో సంబంధం ఉందని భావిస్తున్నారు.
  • 71 శాతం కుటుంబాలు సర్వీసింగ్ కోసం 1-1.5 గంటల కన్నా ఎక్కువ సమయం కేటాయించేందుకు ఇష్టపడటం లేదు.
  • 24 శాతం కుటుంబాలు రూ.300 కన్నా తక్కువ మొత్తాన్నే సర్వీసింగ్ కోసం కేటాయిస్తున్నారు.
  • 26 శాతం మంది మాత్రమే ఏసీ సర్వీసింగ్​తో విద్యుత్ వినియోగంపై ప్రత్యక్షంగా ప్రభావం పడుతుందని భావిస్తున్నారు.

ఇదీ చూడండి:రిలయన్స్​లో మరో సంస్థ భారీ పెట్టుబడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.