కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మేక్ ఇన్ ఇండియా దిశగా మరో భారీ ముందడుగు పడనుంది. 6 అధునాతన జలాంతర్గాముల నిర్మాణానికి రూ. 50 వేల కోట్ల విలువచేసే టెండర్లను నౌకాదళం ఆహ్వానించనుంది. శుక్రవారం జరిగే ఉన్నత స్థాయి భేటీలో ఈ ప్రాజెక్టుపై రక్షణమంత్రిత్వ శాఖ పూర్తి స్థాయిలో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనకు రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపిన తర్వాత.. నౌకాదళం టెండర్ నోటిఫికేషన్ ఇవ్వనుంది.
స్కార్పియన్, కల్వరీ జలాంతర్గాముల నిర్మాణం జరిగిన చాలాకాలం తర్వాత పి-75 ఇండియా ప్రాజెక్టు పేరుతో 6 అధునాతన జలాంతర్గాములను ఫ్రాన్స్ భాగస్వామ్యంతో.. మజగావ్ డాక్యార్డ్ లిమిటెడ్(ఎండీఎల్) నిర్మించనుంది. ఇప్పటికే ఎండీఎల్, ఎల్ అండ్ టీని వ్యూహాత్మక భాగస్వాములుగా గుర్తించిన నౌకాదళం.. ఐదు ప్రపంచ తయారీ సంస్థలైన ఫ్రెంచ్ నావల్ గ్రూప్, జర్మన్ టీకేఎంఎస్, దక్షిణ కొరియా దేవూ, స్పానిష్, రష్యా సంస్థలతో ఒప్పందం చేసుకోనుంది.
ఇవీ చదవండి: భారత నౌకాదళంలో చేరిన ఐఎన్ఎస్ కరంజ్