DRDO testing Aerial Delivery System: ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా రక్షణ, పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్డీఓ) గగనతలంలో భారీ వస్తువులను రవాణా చేసే వ్యవస్థను విజయవంతంగా ప్రదర్శించింది. ఏరియల్ డెలివరీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ (ఏడీఆర్డీఈ) ఆగ్రా విభాగం ఈ గగనతల ప్రదర్శన నిర్వహించింది. 500 కేజీల సామర్థ్యం కలిగిన కంట్రోల్డ్ ఏరియల్ డెలివరీ సిస్టమ్ను ప్రదర్శించింది.
రామ్ ఎయిర్ పారాషూట్ ద్వారా 500 కిలోల బరువైన వస్తువును నిర్దేశిత ప్రాంతంలో దించారు. జీపీఎస్తో అనుసంధానం చేయడం సహా సెన్సార్లు అమర్చడం వల్ల అత్యంత కచ్చితత్వంతో నిర్దేశిత ప్రదేశంలో ఆ వస్తువును పారాషూట్ దించింది. ఇందుకోసం ఏఎన్32 ఎయిర్క్రాఫ్ట్ను ఉపయోగించారు.
ఐదు వేల మీటర్ల ఎత్తు నుంచి గాలిలోకి ఎగిరిన పారాషూట్ నిర్దేశిత ప్రదేశంలో దిగింది. భారత సైన్యం, వాయుసేనకు చెందిన 11 మంది పారాట్రూపర్లు పారాషూట్ను అనుసరిస్తూ పరీక్షను పర్యవేక్షించారు.
ఇదీ చూడండి: 'అగ్ని-ప్రైమ్' క్షిపణి ప్రయోగం విజయవంతం