తమిళనాడు కోయంబత్తూర్ జిల్లా ఇరుగూర్లో ఘోర ప్రమాదం జరిగింది. రైలు పట్టాల మీద నడుచుకుంటూ వెళ్తున్న ఐదుగురు విద్యార్థులను అకస్మాత్తుగా వెనుక వైపు నుంచి వచ్చిన అలప్పుజ-చెన్నై ఎక్స్ప్రెస్ రైలు ఢీ కొట్టింది. ఈ ఘటనలో నలుగురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. మరొక విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థాలానికి చేరుకొని గాయపడిన విద్యార్థిని ఆసుపత్రికి తరలించారు. చనిపోయిన వారిని సోతిక్ రాజా, రాజశేఖర్, కరుపస్వామి, గౌతమ్గా అధికారులు గుర్తించారు. గాయపడిన విద్యార్థి పేరు విశ్వనేశ్ అని పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసుకొని విచారణ ప్రారంభించారు. ఈ ఐదుగురు విద్యార్థులు మద్యం సేవించి రైలు పట్టాల మీద నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగిందని తెలిపారు పోలీసులు.
ఇదీ చూడండి:అయోధ్య రామాలయం కోసం 2,100 కిలోల గంట