ETV Bharat / bharat

ఝార్ఖండ్​: పోలింగ్ కేంద్రం వద్ద కాల్పులు.. ఒకరి మృతి - J'khand: 1 died as cops open fire after group tries to snatch weapons outside poll booth

ఝార్ఖండ్ రెండో దశ పోలింగ్​లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. గుమ్లాలోని సిసాయి నియోజకవర్గంలోని ఓ పోలింగ్ కేంద్రం వద్ద స్థానికులు, పోలీసుల మధ్య ఘర్షణ చెలరేగింది. అల్లరిని అణిచేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒకరు మృతి చెందారు, మరో ఇద్దరికి గాయాలయ్యాయి.

polling
పోలింగ్ కేంద్రం వద్ద కాల్పులు-ఒకరి మృతి
author img

By

Published : Dec 7, 2019, 11:29 AM IST

Updated : Dec 7, 2019, 3:09 PM IST

ఝార్ఖండ్​ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్​లో అవాంఛనీయ ఘటన జరిగింది. పోలీసులు కాల్పులు జరపిన ఘటనలో ఒకరు మృతి చెందారు. ఇద్దరికి గాయాలయయ్యాయి.

గుమ్లాలోని సిసాయి నియోజకవర్గంలో ఓ పోలింగ్ కేంద్రంలో స్థానికులు, భద్రతా బలగాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ నేపథ్యంలో పోలీసుల వద్ద ఉన్న ఆయుధాలను స్వాధీనం చేసుకునేందుకు కొంతమంది స్థానికులు యత్నించారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఆగ్రహించిన స్థానికులు పోలీసు ఇన్స్​పెక్టర్​ లక్ష్యంగా రాళ్లదాడి చేశారు.

"బూత్ నెంబర్ 36 వద్ద స్థానికులు పోలీసుల వద్ద ఉన్న ఆయుధాలను లాక్కునేందుకు యత్నించారు. ఈ కారణంగా పోలీసులు కాల్పులు జరిపారు. "

-పోలీస్ అధికారి

ఇదీ చూడండి: అత్యాచారంపై ప్రశ్నిస్తే ముఖం చాటేసిన డిప్యూటీ సీఎం!

ఝార్ఖండ్​ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్​లో అవాంఛనీయ ఘటన జరిగింది. పోలీసులు కాల్పులు జరపిన ఘటనలో ఒకరు మృతి చెందారు. ఇద్దరికి గాయాలయయ్యాయి.

గుమ్లాలోని సిసాయి నియోజకవర్గంలో ఓ పోలింగ్ కేంద్రంలో స్థానికులు, భద్రతా బలగాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ నేపథ్యంలో పోలీసుల వద్ద ఉన్న ఆయుధాలను స్వాధీనం చేసుకునేందుకు కొంతమంది స్థానికులు యత్నించారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఆగ్రహించిన స్థానికులు పోలీసు ఇన్స్​పెక్టర్​ లక్ష్యంగా రాళ్లదాడి చేశారు.

"బూత్ నెంబర్ 36 వద్ద స్థానికులు పోలీసుల వద్ద ఉన్న ఆయుధాలను లాక్కునేందుకు యత్నించారు. ఈ కారణంగా పోలీసులు కాల్పులు జరిపారు. "

-పోలీస్ అధికారి

ఇదీ చూడండి: అత్యాచారంపై ప్రశ్నిస్తే ముఖం చాటేసిన డిప్యూటీ సీఎం!

Jamshedpur (Jharkhand)/ Khunti (Jharkhand), Dec 07 (ANI): People queue up to cast their votes at a polling station in Jharkhand. The second phase of voting for Assembly elections has begun on Dec 07 at 07:00 am. Second phase voting is being conducted at 20 constituencies. In this phase of elections, over 48 lakh voters will be exercising their democratic right. The counting of votes will take place on December 23.
Last Updated : Dec 7, 2019, 3:09 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.