శిరచ్ఛేదం చేసిన మహిళ మృతదేహాన్ని గుర్తించారు ఝార్ఖండ్లోని రాంచీ పోలీసులు. ఓర్మాంఝీ పీఎస్ పరిధిలోని జిరాబర్ అటవీ ప్రాంతంలో శవం లభ్యమైనట్లు తెలిపారు.
20-30 ఏళ్ల మధ్య వయసున్న ఆ యువతిని ఎక్కడో చంపి ఇక్కడ పడేసుంటారని పోలీసులు భావిస్తున్నారు. హత్యకు ముందు ఆమెపై అత్యాచారం జరిగినట్లు అనుమానిస్తున్నారు.
తల లేని యువతి మృతదేహాన్ని గుర్తించాం. ఎక్కడో హత్య చేసి శవాన్ని ఇక్కడ పడేశారు. పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించాం. శవపరీక్ష అనంతరం అమ్మాయిపై అత్యాచారం జరిగిందా? లేదా? అనేది తెలుస్తుంది. నిందితుల ఆచూకీ కోసం అన్ని కోణాల్లో దర్యాప్తును ప్రారంభించాం. ఆమె ఎవరనే విషయం తెలుసుకోవడానికీ ప్రయత్నాలు ముమ్మరం చేశాము. డాగ్ స్క్వాడ్నూ పిలిపించాం. కేసు త్వరలోనే ఓ కొలిక్కొచ్చే అవకాశం ఉంది.
-నౌషద్ ఆలాం, పోలీసు అధికారి
గత కొద్ది రోజులుగా వచ్చిన మిస్సింగ్ కేసులు సహా సెల్ఫోన్ సిగ్నల్స్ను నిశితంగా పరిశీలిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: మూడేళ్ల పాప లాకప్ డెత్పై నిరసన జ్వాల