బాంబు తయారు చేశాడన్న కారణంతో 16 ఏళ్ల బాలున్ని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన తమిళనాడులోని తంజావూర్ జిల్లా కుంభకోణంలో జరిగింది.
బిహార్ నుంచి వచ్చిన ఓ యువకుడి నుంచి ఈ బాలుడు నాటు బాంబు తయారు చేయడం నేర్చుకున్నాడు. ఇద్దరు కలిసి బాంబు తయారు చేస్తుండగా బాలుడి స్నేహితుడు దానిని చిత్రీకరించాడు. అనంతరం ఈ వీడియో అంతర్జాలంలో పోస్టు చేశాడు.
ఈ కేసులో ఆ బాలున్ని, వీడియో తీసిన అతని స్నేహితున్ని పోలీసులు అరెస్టు చేశారు. కుంభకోణంలోని ఓ రోడ్డుకు సమీపంలో బాంబును గుర్తించారు పోలీసులు.
ప్రధాన నిందితుడైన బాలుడిని.. తంజావూరులోని పరివర్తన గృహానికి తరలించారు.
ఇదీ చదవండి: లద్దాఖ్ సమీపంలో మళ్లీ చైనా సైన్యం కదలికలు