బ్యాంకులు...మెుండి బకాయిల భారం..!

By

Published : Jul 1, 2020, 10:58 PM IST

Updated : Jul 1, 2020, 11:07 PM IST

thumbnail

కరోనా సంక్షోభం వలన భారత బ్యాంకింగ్​ రంగం కోలుకోవడానికి ఏళ్లు పట్టే అవకాశం ఉందని... అంతర్జాతీయ రేటింగ్​ సంస్థ స్టాండర్డ్​ అండ్​ పూర్స్ అంచనా వేసింది. 2019-20లో 8.5గా ఉన్న స్థూల నిరర్ధక ఆస్తుల నిష్పత్తి.. 2020-21లో 14 శాతానికి పెరగొచ్చని తెలిపింది. రుణాల పునర్​వ్యవస్థీకరణలో ఎన్​పీఏలు గుర్తించడం వాయిదా పడొచ్చేమోగాని.. అది సమస్యకు పరిష్కారం మాత్రం కాదని పేర్కొంది. లాక్​డౌన్​ కారణంగా ఆర్థిక కార్యకలాపాలు దెబ్బతినడం వల్ల మొండి బకాయిల వసూళ్లు బాగా పడిపోవడమే కాకుండా మరింత పెరిగే అవకాశం ఉందని ఎస్​ అండ్​ ​పీ అంచనా వేసింది. బ్యాంకులతో పోలిస్తే బ్యాంకింగేతర ఆర్థిక సమస్యలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పింది. ఈ నేపథ్యంలో కొవిడ్​-19 సంక్షోభం ప్రభావం బ్యాంకింగ్​ రంగంపై ఎంతకాలం ఉంటుంది.. కోలుకునే మార్గాలేమిటనే అంశాలపై ప్రతిధ్వని చర్చ..

Last Updated : Jul 1, 2020, 11:07 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.