ఒంగోలులో నరకాసుర వధ..భారీగా తరలివచ్చిన ప్రజలు - ప్రకాశం జిల్లా వార్తలు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-13544390-992-13544390-1636007161306.jpg)
ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో ప్రండ్స్ క్లబ్ ఆధ్వర్యంలో తాతా బిల్డింగ్ వద్ద దీపావళి సందర్భంగా ఈ రోజు వేకువ జామున నరకాసుర వధ కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించారు. ప్రతీ ఏటా నిర్వహించే ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు. గత పదకొండేళ్ళుగా ఈ ప్రాంతంలో నరకాసుర వధను నిర్వహిస్తున్నారు. 40 అడుగుల నరకాసురుని ప్రతిమను తయారుచేసి, బాణసంచా పేలుళ్ల మధ్య దహన కార్యక్రమం చేపట్టారు.