thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 29, 2023, 3:41 PM IST

ETV Bharat / Videos

విజ్ఞానవంతమైన సమాజాన్ని సృష్టించడంలో పుస్తకాలే కీలకం: కేంద్ర సాహిత్య అకాడమీ ఛైర్మన్​

Vijayawada Book Festival : దేశంలో ఎన్నో పుస్తక ప్రదర్శనలు దిగ్విజయంగా కొనసాగుతున్నాయంటే అందుకు కారణం పాఠకుల ఆదరణ, వారిలోని పఠనాశక్తి అని ప్రముఖ రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షులు మాధవ్​ కౌశిక్​ పేర్కొన్నారు. పుస్తక ప్రదర్శనలు ప్రతి సంవత్సరం పెరుగుతున్నాయని విజ్ఞానవంత సమాజాన్ని సృష్టించడంలో పుస్తకాలే కీలకమని అన్నారు.

Kendra Sahitya Akademi Chairman Madhav Koushik attend to Book Festival: 34వ విజయవాడ పుస్తక మహోత్సవం గురువారం విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్​ కళాశాలలో ఘనంగా ప్రారంభమైంది. కేంద్ర సాహిత్య అకాడమీ ఛైర్మన్​ మాధవ్​ కౌశిక్​ ఈ మహోత్సవానికి శ్రీకారం చుట్టారు. జనవరి ఏడో తేదీ వరకు జరిగే ఈ పుస్తక మహోత్సవం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ప్రస్తుత స్మార్ట్​ ఫొన్​ ప్రపంచంలో పుస్తక పఠనానికి అవకాశాలు పెరిగాయని ఒక్క చరవాణిలోనే మొత్తం గ్రంథాలయాలు ఉంటున్నాయని పేర్కొన్నారు. స్టార్ట్​ఫోన్లు నేటి తరాన్ని పుస్తక పఠనానికి దూరం చేస్తున్నాయంటే తాను అంగీకరించబోనని ఈటీవీ భారత్​ ముఖాముఖిలో తెలిపారు. ఈ పుస్తక ప్రదర్శనకు వేలాది పుస్తక ప్రియులు విచ్చేసి మది దోచే రచనలను సొంతం చేసుకున్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.