అంగన్వాడీల దీక్షా శిబిరానికి నిప్పు - వైసీపీ నాయకులపై అనుమానం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 16, 2024, 7:26 PM IST

thumbnail

Tent Caught Fire at Anganwadi Workers Initiation Camp: అనంతపురం కలెక్టర్ కార్యాలయం వద్ద అంగన్వాడీ చేపట్టిన దీక్ష శిబిరానికి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. దీనిపై అంగన్వాడీలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 36 రోజులుగా కలెక్టర్ కార్యాలయ సమీపంలో దీక్షా శిబిరాన్ని పరదాలతో ఏర్పాటు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు పరదాకు ఒకవైపు నిప్పు పెట్టారు. దీంతో స్థానికులు గమనించి వాటిని ఆర్పేశారు. 

ఉదయాన్నే దీక్ష శిబిరం వద్దకు వచ్చిన అంగన్వాడీలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమను బెదిరించడానికి ఇలాంటి ధోరణి అవలంబిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఈ ప్రభుత్వానికి అంగన్వాడీలపై ఎందుకీ కక్ష సాధింపు చర్యలు అని మండిపడ్డారు. నిప్పు పెట్టిన సమయంలో అంగన్వాడీలు ఉండి ఉంటే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. వైసీపీ నాయకులే నిప్పు పెట్టి ఉంటారనే అనుమానం ఉందని అంగన్వాడీలు తెలిపారు. ఇలాంటి వ్యవహారాలు ఎన్ని చేసినా తమ సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని అంగన్వాడీలు హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.