శిధిలావస్థలో ఉన్న మండపాల పునరుద్ధరణ - తమకు సంబంధం లేదన్న పురావస్తు శాఖ - tirumala mandapam news
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 8, 2023, 6:47 PM IST
RESTORATION OF DILAPITED MANDAPAM: తిరుమలలో మండపాలను అస్తవ్యస్తంగా చేసే ఆలోచన తమకి లేదని.. శిధిలావస్థలో ఉన్న పారువేట మండపాన్ని జీర్ణోద్ధరణ చేశామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో పారువేట మండపం వివాదంపై స్పందించారు. కొత్త మండపాన్ని అద్భుతంగా నిర్మించామని.. పాత మండపంలోని శిల్పాలను అలాగే ఉంచామన్నారు. అలిపిరి పాదాల వద్ద ఉన్న విశ్రాంతి మండపం శిధిలావస్థకు చేరుకుందని.. రాతి స్తంభాలను అలాగే ఉంచి మళ్లీ నిర్మిస్తామని తెలిపారు.
పురావస్తు శాఖ అధికారులతో మాట్లాడామని.. తమ పరిధిలో లేని మండపాలతో తమకు సంబంధం లేదని తెలిపినట్లు వెల్లడించారు. పురావస్తు శాఖ వారు వచ్చి మండపాలను నిర్మిస్తే తమకు ఎటువంటి అభ్యంతరం లేదని ధర్మారెడ్డి చెప్పుకొచ్చారు. 2019 నుంచి శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 1600 ఆలయాలు నిర్మించామన్నారు. నవంబర్ 1 నుంచి ఇప్పటి వరకు తిరుమల నడకమార్గంలో చిరుత, ఎలుగుబంటి సంచారం లేదని తెలిపారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.