Owner Locked Village Secretariat Building : మూడేళ్లుగా అద్దె బకాయి.. అనకాపల్లి జిల్లాలో సచివాలయానికి తాళం వేసిన యజమాని
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg?imwidth=128)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 23, 2023, 1:48 PM IST
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/23-08-2023/640-480-19336275-thumbnail-16x9-lock-sachival.jpg)
Owner Locked Village Secretariat Building : అనకాపల్లి జిల్లాలో ఓ సచివాలయానికి తాళం దర్శనమిచ్చింది. అద్దె చెల్లించలేదని భవన యజమాని ఈ చర్యకు దిగటంతో.. సిబ్బంది చెట్ల కిందే విధులు నిర్వహించారు. జిల్లాలోని బుచ్చయ్యపేట మండలానికి చెందిన లోపూడి గ్రామ సచివాలయానికి సొంత భవనం లేకపోగా.. చప్పా సత్యారావు అనే వ్యక్తి భవనాన్ని అద్దెకు తీసుకుని అందులోనే సచివాలయ కార్యకాలపాలు నిర్వహిస్తున్నారు. అయితే గత 30 నెలలుగా తనకు అద్దె నగదు చెల్లించలేదని.. బాకీ ఉన్న నగదు ఇవ్వాలని యజమాని తాళం వేశాడు. ఎప్పటిలాగానే విధుల కోసం సచివాలయానికి వచ్చిన సిబ్బందికి తాళం దర్శనమిచ్చింది. దీంతో సిబ్బంది యజమానిని సంప్రదించగా.. తానే వేసినట్లు తెలిపాడు. నెలకు 2వేల 500 రూపాయలు చెల్లించాల్సి ఉండగా.. ఇప్పటికి 30 నెలల అద్దె చెల్లించలేదని వివరించాడు. తాళం తీయమని సిబ్బంది నచ్చచెప్పిన.. తనకు అద్దె చెల్లించే వరకు తాళం తీసేదే లేదని తేల్చి చెప్పాడు. దీంతో సిబ్బంది చేసేదేమి లేక సచివాలయం ఎదుట ఉన్న ఓ చెట్టు కింద విధులు నిర్వహించారు. సచివాలయానికి వచ్చిన ప్రజలకు సిబ్బంది సమాధానమిచ్చి తిరిగి పంపిస్తున్నారు.