thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 29, 2023, 9:31 PM IST

ETV Bharat / Videos

వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచే పోటీ చేస్తా - అవసరమైతే కొత్త పార్టీ పెడతా: మాజీ జేడీ లక్ష్మీనారాయణ

Former JD Lakshminarayana will Contest from Visakha in Next Elections: ఏపీ ఎన్నికల్లో విశాఖ నుంచే పోటీ చేస్తానని.. అవసరం అయితే కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉందని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. బుధవారం విశాఖలోని డాబా గార్డెన్స్​లో మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో బోగస్ ఓట్ల ఏరివేత ఖచ్చితంగా జరగాలన్నారు. డూప్లికేట్ ఓట్లు తొలగించాల్సిందేనని అన్నారు. నిజమైన ఓట్ల తొలగింపుపై ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

రాష్ట్రంలో ఒక కొత్త ఒరవడి.. కొత్త ఆలోచనలను తీసుకొద్దామన్న సంకల్పం ఉంది.. ఆ సంకల్పాన్ని త్వరలోనే ప్రకటిస్తానని స్పష్టం చేశారు. అలానే నేను కొత్త పార్టీ పెట్టాక యువత ఎవరు వచ్చినా నేను ప్రోత్సహిస్తానని అన్నారు. అది ఆలోచనలు ఉన్న యువత వస్తే మంచిది.. చదువుకున్నంత మాత్రాన మంచి ఆలోచనలు ఉండాలని లేదని ఈ సందర్భంగా ఆయన అన్నారు.  ఒక ప్రజాస్వామ్యం కోసం మంచి ఆలోచనలు ఉన్న ఎవరైనా వస్తే మంచిది.. ముఖ్యంగా యువతను ఎక్కువగా ప్రోత్సహిస్తే బాగుంటుందని అన్నారు. రాజకీయాల్లో పోటీ చేయాలంటే క్వాలిఫికేషన్​ అవసరం అని రాజ్యాంగంలో కూడా లేదు.. కేవలం ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన ఉంటే సరిపోతుందని జేడీ లక్ష్మీనారాయణ అన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.