కడపకు చేరిన అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ అక్షింతలు - కనుల పండువగా శోభాయాత్ర

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 17, 2023, 4:28 PM IST

thumbnail

Distribution of Ayodhya Ram Prana Pratishtha Akshitalu to All  States: ఉత్తర్‌ప్రదేశ్‌ అయోధ్యలో రాముడి విగ్రహం ప్రాణ ప్రతిష్ఠకై అక్షింతల పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ అక్షింతలను దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, జిల్లాలకు పంపిణీ చేశారు. అందులో భాగంగా వైఎస్ఆర్ జిల్లా కడపకు ఐదు కిలోల అక్షింతలు వచ్చాయి.

Shobhayatra in Kadapa: అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలను కడపలో ప్రత్యేక వాహనంలో ఊరేగించారు. విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో శోభాయాత్ర నిర్వహించారు. ఈ యాత్ర మోచంపేటలోని శివాలయం నుంచి మొదలై కడప పాత బస్టాండ్​లో గాలిదేవర ఆంజనేయస్వామి దేవాలయం వరకు కొనసాగింది. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో మహిళా భక్తులు హాజరై.. జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. ప్రతి హిందువుకు అక్షింతలు చేరాలని నిర్వాహకులు ఆకాంక్షించారు. ఈ యాత్రకు బ్రహ్మం గారి మఠం పీఠాధిపతి హాజరయ్యారు. అనంతరం దేవర ఆంజనేయస్వామి దేవాలయంలో అక్షింతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి పంపిణీ చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.