70 Families From YCP Joined TDP in YSR Ddistrict: వైసీపీను వీడి టీడీపీలోకి చేరిన 70 కుటుంబాలు.. అవినీతిని భరించలేకే చేరామన్న సర్పంచ్
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg?imwidth=128)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 25, 2023, 4:19 PM IST
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/25-09-2023/640-480-19602762-thumbnail-16x9-ycp-joined-tdp.jpg)
70 Families From YCP Joined TDP in YSR Ddistrict: రాష్ట్రంలో వైసీపీ నుంచి వలసలు కొనసాగుతున్నాయి. ఆ పార్టీలో నాయకుల ఒత్తిళ్లు తట్టుకోలేక చాలామంది నాయకులు పార్టీకి వీడ్కోలు పలుకుతున్నారు. వైసీపీ నాయకులు కూడా ఇష్టానురీతిలో వ్యవహరించడం అలానే వారి పెత్తనాలను భరించలేక పార్టీలో చీలికలు మొదలయ్యాయి. వైయస్సార్ జిల్లాలో కూడా వైసీపీ నాయకుల ఒత్తిళ్లు తట్టుకోలేక చాలామంది తెలుగుదేశం తీర్ధం పుచ్చుకున్నారు. జిల్లాలోని మైదుకూరు మండలం శివపురం గ్రామాంలో వైసీపీ వర్గానికి చెందిన సర్పంచ్ కొండా భాస్కర్ రెడ్డి ఈ రోజు మైదుకూరు నియోజకవర్గ పార్టీ ఇంచార్జ్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి రాష్ట్ర పోలీస్ బ్యూరో సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో కొండా భాస్కర్ రెడ్డితో పాటు ఆయన వర్గానికి చెందిన 70 కుటుంబాలు తెలుగు దేశం పార్టీలో చేరారు.. వైసీపీ నాయకులు వేధింపులకు పాల్పడుతుండటంతో వైసీపీ వర్గానికి చెందిన సర్పంచ్ వారు తెలుగుదేశం పార్టీలోకి చేరడానికి ఆ పార్టీ నాయకులు హర్షించారు.