ETV Bharat / state

'ఈ ఎన్నికలతో తెదేపా పూర్తిగా ఖాళీ అవుతుంది'

author img

By

Published : Mar 13, 2020, 12:29 PM IST

కడప జిల్లా రాజంపేటలోని మేడా భవనంలో వైకాపా ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని పార్టీ జెండాను మాజీ రాజ్యసభ సభ్యుడు, రాజంపేట పార్లమెంట్ ఎన్నికల వైకాపా బాధ్యుడు సి రామచంద్రయ్య ఎగుర వేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.

ysrcp  Formation day celabrations
రాజంపేటలో వైకాపా ఆవిర్భావ దినోత్సవం
రాజంపేటలో వైకాపా ఆవిర్భావ దినోత్సవం

ప్రస్తుతం జరుగుతున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో తెదేపా పూర్తిగా ఖాళీ అవుతుందని మాజీ రాజ్యసభ సభ్యుడు, రాజంపేట పార్లమెంట్ ఎన్నికల వైకాపా బాధ్యుడు సి. రామచంద్రయ్య తెలిపారు. వైకాపా ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని కడప జిల్లా రాజంపేటలోని మేడా భవనంలో జెండా ఆవిష్కరించారు. ఓటమి భయంతో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నారని, చిన్న చిన్న విషయాలకు ఫిర్యాదులు చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి...

'ప్రభుత్వం గెలిచినా ఓడినట్లే... ప్రతిపక్షాలు ఓడినా గెలిచినట్లే'

రాజంపేటలో వైకాపా ఆవిర్భావ దినోత్సవం

ప్రస్తుతం జరుగుతున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో తెదేపా పూర్తిగా ఖాళీ అవుతుందని మాజీ రాజ్యసభ సభ్యుడు, రాజంపేట పార్లమెంట్ ఎన్నికల వైకాపా బాధ్యుడు సి. రామచంద్రయ్య తెలిపారు. వైకాపా ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని కడప జిల్లా రాజంపేటలోని మేడా భవనంలో జెండా ఆవిష్కరించారు. ఓటమి భయంతో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నారని, చిన్న చిన్న విషయాలకు ఫిర్యాదులు చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి...

'ప్రభుత్వం గెలిచినా ఓడినట్లే... ప్రతిపక్షాలు ఓడినా గెలిచినట్లే'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.