కడప జిల్లా బ్రహ్మంగారి మఠం గ్రామంలోని వైకాపాలో రెండు వర్గాలున్నాయి. ఒక వర్గం వారికే సంక్షేమ పథకాలను అమలు చేస్తూ.. తమ వర్గం వారికి అన్యాయం చేస్తున్నారంటూ సచివాలయంలో ఓ వర్గ నాయకుడు మండిపడ్డాడు. ఆదివారం సెలవురోజైనా కొత్తగా మంజూరైన రేషన్ కార్డులను పంపిణీ చేసేందుకు సిబ్బంది సచివాలయం చేరుకోగా.. ఆ నాయకుడు వారితో వాగ్వాదానికి దిగాడు. ఈ ఘటనతో సచివాలయ సిబ్బంది బిక్కుబిక్కుమంటూ గడిపారు. అదే క్రమంలో ఆ నాయకుడు గ్రామానికి చెందిన ఒక వాలంటీర్పై దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సచివాలయ సిద్ధమైనట్లు సమాచారం.
ఇవీ చదవండి: భారీ వర్షాలు... నిండుకుండల్లా జలాశయాలు