ETV Bharat / state

మైలవరం నుంచి పెన్నాకు నీరు విడుదల - మైలవరం నుంచి పెన్నాకి నీటి విడుదల తాజా వార్తలు

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు... మైలవరం జలాశయం కళకళలాడుతోంది. దీంతో పెన్నా నదికి నీటిని విడుదల చేశారు.

Mylavaram reservoir water release to penna river
author img

By

Published : Oct 24, 2019, 11:07 AM IST

కడప జిల్లా మైలవరం జలాశయం నుంచి పెన్నా నదికి నీటిని విడుదల చేశారు. గండికోట జలాశయం నుంచి 2500 క్యూసెక్కుల నీటిని మైలవరం జలాశయానికి వదిలారు. ఎగువ నుంచి వరద ప్రవాహం ఎక్కువ ఉంది. ఫలితంగా రిజర్వాయర్ నుంచి పెన్నాకు 5 వేల క్యూసెక్కులు వదులుతున్నారు. నది పరిసర ప్రాంతాల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

ఎగువ నుంచి నీటి విడుదల ఎక్కువయితే మరో 5 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయనున్నారు. చేపల వేటకు వెళ్ళేవారు... పెన్నా పరిసర ప్రాంతాల్లో ఉండకూడదని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం గండికోట జలాశయంలో 11.9 టీఎంసీల నీరు ఉండగా, మైలవరం జలాశయంలో 6 టీఎంసీలకు పైగా నీరు ఉంది.

మైలవరం నుంచి పెన్నాకి నీటి విడుదల

ఇదీచూడండి.నిరంతర ప్రవాహం... నిండుకుండల్లా జలాశయాలు

కడప జిల్లా మైలవరం జలాశయం నుంచి పెన్నా నదికి నీటిని విడుదల చేశారు. గండికోట జలాశయం నుంచి 2500 క్యూసెక్కుల నీటిని మైలవరం జలాశయానికి వదిలారు. ఎగువ నుంచి వరద ప్రవాహం ఎక్కువ ఉంది. ఫలితంగా రిజర్వాయర్ నుంచి పెన్నాకు 5 వేల క్యూసెక్కులు వదులుతున్నారు. నది పరిసర ప్రాంతాల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

ఎగువ నుంచి నీటి విడుదల ఎక్కువయితే మరో 5 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయనున్నారు. చేపల వేటకు వెళ్ళేవారు... పెన్నా పరిసర ప్రాంతాల్లో ఉండకూడదని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం గండికోట జలాశయంలో 11.9 టీఎంసీల నీరు ఉండగా, మైలవరం జలాశయంలో 6 టీఎంసీలకు పైగా నీరు ఉంది.

మైలవరం నుంచి పెన్నాకి నీటి విడుదల

ఇదీచూడండి.నిరంతర ప్రవాహం... నిండుకుండల్లా జలాశయాలు

Intro:slug:
AP_CDP_36_24_PENNAKU_NEETI_VIDUDALA_AV_AP10039
contributor: arif, jmd
పెన్నా కు నీటి విడుదల
( ) కడప జిల్లా మైలవరం జలాశయం నుంచి పెన్నా నదికి నీటిని విడుదల చేశారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు నీరు చేరుతుండడంతో నీటిపారుదల శాఖ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. గండికోట జలాశయం నుంచి మైలవరం రిజర్వాయర్ కు 2500 క్యూసెక్కుల నీటిని పంపుతున్నట్లు జల వనరుల శాఖ ఈ రామాంజనేయులు తెలిపారు. మైలవరం జలాశయం నుంచి పెన్నాకు 5 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. నది పరిసర ప్రాంతాల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సంబంధిత అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎగువ నుంచి నీటి విడుదల ఎక్కువ అయితే మరో 5 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తామన్నారు. చేపల వేటకు వెళ్ళేవారు ,రజకులు పెన్నా పరిసర ప్రాంతాల్లో ఉండకూడదని ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం గండికోట జలాశయం లో 11.9 టీఎంసీల నీరు నిల్వ ఉండగా మైలవరం జలాశయం లో ఆరు టీఎంసీలకు పైగా నీరు ఉంది


Body:AP_CDP_36_24_PENNAKU_NEETI_VIDUDALA_AV_AP10039


Conclusion:AP_CDP_36_24_PENNAKU_NEETI_VIDUDALA_AV_AP10039
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.