ETV Bharat / state

ఆకతాయిల ఆగడాలు... రెండు బైకులు దగ్ధం - Kadapa latest crime news

పార్కింగ్ చేసిన రెండు ద్విచక్రవాహనాలను గుర్తుతెలియని వ్యక్తులు దహనం చేశారు. ఈ ఘటన కడప పాత బస్టాండ్​లోని పీఎన్ఆర్ లాడ్జి ఆవరణంలో జరిగింది.

unknown persons destroy two bikes at Kadapa town
ఆకతాయిల ఆగడాలు... రెండు బైకులు దగ్ధం
author img

By

Published : Oct 3, 2020, 4:55 PM IST

కడపకు చెందిన మస్తాన్, మోహన్ రెడ్డి అనే ఇద్దరు వ్యక్తులు చిరు వ్యాపారాలు చేస్తూ జీవనం సాగించేవారు. అందులో భాగంగా..ఆ ఇద్దరు తమ బైకులను పట్టణంలోని బస్టాండ్​లోని పీఎన్ఆర్ లాడ్జి ఆవరణంలో పార్కింగ్ చేశారు. అయితే ఆకతాయిలు తాగిన మైకంలో ఆ వాహనాలపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. మంటలను గమనించిన స్థానికులు... అగ్నిమాపక శాఖకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది మంటలను అదుపు చేశారు. అప్పటికే రెండు వాహనాలు కాలి బూడిదయ్యాయి.

ఈ ప్రమాదంలో సుమారు రూ. లక్ష ఆస్తి నష్టం వాటిల్లిందని పేర్కొన్న బాధితులు...1వ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలో పెట్రోల్ సీసా లభించడం వల్ల పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.

కడపకు చెందిన మస్తాన్, మోహన్ రెడ్డి అనే ఇద్దరు వ్యక్తులు చిరు వ్యాపారాలు చేస్తూ జీవనం సాగించేవారు. అందులో భాగంగా..ఆ ఇద్దరు తమ బైకులను పట్టణంలోని బస్టాండ్​లోని పీఎన్ఆర్ లాడ్జి ఆవరణంలో పార్కింగ్ చేశారు. అయితే ఆకతాయిలు తాగిన మైకంలో ఆ వాహనాలపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. మంటలను గమనించిన స్థానికులు... అగ్నిమాపక శాఖకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది మంటలను అదుపు చేశారు. అప్పటికే రెండు వాహనాలు కాలి బూడిదయ్యాయి.

ఈ ప్రమాదంలో సుమారు రూ. లక్ష ఆస్తి నష్టం వాటిల్లిందని పేర్కొన్న బాధితులు...1వ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలో పెట్రోల్ సీసా లభించడం వల్ల పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.

ఇదీ చూడండి:

రెవెన్యూ ఉద్యోగుల అసోసియేషన్ కార్యవర్గం ఎన్నిక ఏకగ్రీవమే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.