ETV Bharat / state

ఆకతాయిల ఆగడాలు... రెండు బైకులు దగ్ధం

పార్కింగ్ చేసిన రెండు ద్విచక్రవాహనాలను గుర్తుతెలియని వ్యక్తులు దహనం చేశారు. ఈ ఘటన కడప పాత బస్టాండ్​లోని పీఎన్ఆర్ లాడ్జి ఆవరణంలో జరిగింది.

author img

By

Published : Oct 3, 2020, 4:55 PM IST

unknown persons destroy two bikes at Kadapa town
ఆకతాయిల ఆగడాలు... రెండు బైకులు దగ్ధం

కడపకు చెందిన మస్తాన్, మోహన్ రెడ్డి అనే ఇద్దరు వ్యక్తులు చిరు వ్యాపారాలు చేస్తూ జీవనం సాగించేవారు. అందులో భాగంగా..ఆ ఇద్దరు తమ బైకులను పట్టణంలోని బస్టాండ్​లోని పీఎన్ఆర్ లాడ్జి ఆవరణంలో పార్కింగ్ చేశారు. అయితే ఆకతాయిలు తాగిన మైకంలో ఆ వాహనాలపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. మంటలను గమనించిన స్థానికులు... అగ్నిమాపక శాఖకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది మంటలను అదుపు చేశారు. అప్పటికే రెండు వాహనాలు కాలి బూడిదయ్యాయి.

ఈ ప్రమాదంలో సుమారు రూ. లక్ష ఆస్తి నష్టం వాటిల్లిందని పేర్కొన్న బాధితులు...1వ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలో పెట్రోల్ సీసా లభించడం వల్ల పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.

కడపకు చెందిన మస్తాన్, మోహన్ రెడ్డి అనే ఇద్దరు వ్యక్తులు చిరు వ్యాపారాలు చేస్తూ జీవనం సాగించేవారు. అందులో భాగంగా..ఆ ఇద్దరు తమ బైకులను పట్టణంలోని బస్టాండ్​లోని పీఎన్ఆర్ లాడ్జి ఆవరణంలో పార్కింగ్ చేశారు. అయితే ఆకతాయిలు తాగిన మైకంలో ఆ వాహనాలపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. మంటలను గమనించిన స్థానికులు... అగ్నిమాపక శాఖకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది మంటలను అదుపు చేశారు. అప్పటికే రెండు వాహనాలు కాలి బూడిదయ్యాయి.

ఈ ప్రమాదంలో సుమారు రూ. లక్ష ఆస్తి నష్టం వాటిల్లిందని పేర్కొన్న బాధితులు...1వ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలో పెట్రోల్ సీసా లభించడం వల్ల పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.

ఇదీ చూడండి:

రెవెన్యూ ఉద్యోగుల అసోసియేషన్ కార్యవర్గం ఎన్నిక ఏకగ్రీవమే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.