ETV Bharat / state

పెన్నానదిలో ఐదు మృతదేహాలు లభ్యం.. మరో ఇద్దరి కోసం గాలింపు

కడప జిల్లా సిద్ధవటం పెన్నానదిలో గల్లంతయిన ఏడుగురిలో.. ఐదుగురి మృతదేహాలు లభ్యం అయ్యాయి. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. గురువారం ఇద్దరి మృతదేహాలను, శుక్రవారం మూడు మృతదేహాలను వెలికి తీశారు.

author img

By

Published : Dec 18, 2020, 9:16 AM IST

Updated : Dec 18, 2020, 12:44 PM IST

five dead bodies found in penna
five dead bodies found in penna

స్నేహితుని తండ్రి కర్మకాండకు గురువారం కడప జిల్లా సిద్ధవటం వచ్చిన తిరుపతి యువకులు పెన్నా నదిలో స్నానానికి దిగి గల్లంతయ్యారు. ప్రారంభంలో లోతు పెద్దగా లేకపోవటంతో క్రమంగా లోపలికి వెళ్లిన యువకుల్లో ఒకరు మునిగిపోతుండగా... కాపాడే క్రమంలో ఏడుగురు కొట్టుకుపోయారు. ఇప్పటివరకు ఐదు మృతదేహాలను వెలికితీశారు. కళ్లెదుట బిడ్డల మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు గుండెలు పగిలేలా విలపిస్తున్నారు.

మరో రెండు మృతదేహాల కోసం అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. రెండు బోట్లు, 60 మంది గజ ఈతగాళ్లతో గాలిస్తున్నారు.

స్నేహితుని తండ్రి కర్మకాండకు గురువారం కడప జిల్లా సిద్ధవటం వచ్చిన తిరుపతి యువకులు పెన్నా నదిలో స్నానానికి దిగి గల్లంతయ్యారు. ప్రారంభంలో లోతు పెద్దగా లేకపోవటంతో క్రమంగా లోపలికి వెళ్లిన యువకుల్లో ఒకరు మునిగిపోతుండగా... కాపాడే క్రమంలో ఏడుగురు కొట్టుకుపోయారు. ఇప్పటివరకు ఐదు మృతదేహాలను వెలికితీశారు. కళ్లెదుట బిడ్డల మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు గుండెలు పగిలేలా విలపిస్తున్నారు.

మరో రెండు మృతదేహాల కోసం అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. రెండు బోట్లు, 60 మంది గజ ఈతగాళ్లతో గాలిస్తున్నారు.


ఇదీ చదవండి:

విషాదం: పెన్నా నదిలో ఏడుగురు గల్లంతు!

Last Updated : Dec 18, 2020, 12:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.