ETV Bharat / state

ఆసుపత్రుల్లో.. పరికరాలున్నా పనిచేయవు - ఏపీ తాజా సమాచారం

ప్రభుత్వాసుపత్రుల్లో రోగ నిర్ధారణ యంత్రాలు, పరికరాలు పనిచేస్తున్నా, సాంకేతిక నిపుణలు లేక రోగులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మరోవైపు నిర్వహణ కోసం తగిన నిధులు లేకపోవడం, పర్యవేక్షణ లోపంవల్ల యంత్రాలు మొరాయించడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. రాష్ట్రంలో అన్ని రకాల ఆసుపత్రుల్లో కలిపి వేల సంఖ్యలోనే యంత్రాలు, ఆపరేషన్‌ థియేటర్లలోని పరికరాలు పనిచేయని పరిస్థితుల్లో ఉన్నాయని తెలిసింది.

Diagnosis machines
Diagnosis machines
author img

By

Published : Apr 4, 2022, 5:46 AM IST

ప్రభుత్వాసుపత్రుల్లో వ్యాధి నిర్ధారణ యంత్రాలు, పరికరాలు పని చేయకపోవడంతో రోగులు అవస్థలు పడుతున్నారు. ప్రైవేటు కేంద్రాల్లో పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తుండటంతో రోగులు ఆర్థికంగా నష్టపోతున్నారు. పలు ఆసుపత్రుల్లో యంత్రాలు పని చేస్తున్నా.. సాంకేతిక నిపుణులు, రోగులను చూడాల్సిన వైద్యులు లేనందున వాటివల్ల ఉపయోగం కనిపించడం లేదు. నిర్వహణ కోసం తగిన నిధులు లేకపోవడం, పర్యవేక్షణ లోపంవల్ల యంత్రాలు మొరాయించడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మరమ్మతుల కోసం సాంకేతిక నిపుణులను పిలుస్తున్నా.. చెల్లింపుల్లో జాప్యం కారణంగా వారి నుంచి సహకారం లభించడం లేదని ఆసుపత్రుల వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. అన్ని రకాల ఆసుపత్రుల్లో కలిపి వేల సంఖ్యలోనే యంత్రాలు, ఆపరేషన్‌ థియేటర్లలోని పరికరాలు పనిచేయని పరిస్థితుల్లో ఉన్నాయని తెలిసింది.

* తూర్పుగోదావరి జిల్లాలో ప్రధానమైన రాజమహేంద్రవరం జిల్లా ఆసుపత్రిలో రెండేళ్ల నుంచి సి.టి.స్కానర్‌ పని చేయడంలేదు.

* గుంటూరు జిల్లా తెనాలి జిల్లా ప్రభుత్వాసుపత్రిలోని సి.టి.స్కానర్‌ పరిస్థితి అంతే.

* పశ్చిమగోదావరి జిల్లా భీమవరం ప్రభుత్వాసుపత్రిలో రెండు స్కానింగ్‌ పరికరాలున్నాయి. వీటిలో ఒకటి అధునాతనమైనది. రేడియాలజిస్టులు లేనందున ఇవి రెండు ఉపయోగించే పరిస్థితులు కనిపించడం లేదు.

* కడప జిల్లా రాజంపేటలోని ఆసుపత్రిలో చాలాకాలంగా పెద్ద ఎక్స్‌రే యంత్రం పనిచేయడం లేదు. దీంతో మొబైల్‌ యంత్రంతో సరిపెడుతున్నారు. ప్రొద్దుటూరు జిల్లా ప్రభుత్వాసుపత్రిలో అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ యంత్రం మూలకు చేరింది. సిబ్బంది కొరతతో వినియోగించడం లేదు. ఇక్కడున్న రేడియాలజిస్టు సెలవుపై వెళ్లి తిరిగిరాలేదు. 8 నెలలు దాటినా మరొకరిని నియమించలేదు. ముఖ్యంగా గర్భిణులకు తీవ్ర ఇబ్బందిగా మారింది.

* చిత్తూరు జిల్లా పుత్తూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో గతేడాది డిసెంబరు నుంచి ఎక్స్‌రే యంత్రం పని చేయడం లేదు.

* పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్కానింగ్‌ పరికరం గత కొన్నేళ్ల నుంచి పని చేయడం లేదు. ఇక్కడ ఐదేళ్లుగా గైనకాలజిస్టు పోస్టు ఖాళీగా ఉంది. తణుకు ఆసుపత్రిలో రేడియాలజిస్టు లేనందున రెండు నెలల నుంచి స్కానింగ్‌ సెంటర్‌ తలుపులకు తాళాలు పడ్డాయి. పోలవరం సామాజిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు లేనందున స్కానింగ్‌ మిషన్‌ను ఉపయోగించడం లేదు. ఆచంట సామాజిక ఆరోగ్య కేంద్రంలో గడిచిన మూడేళ్లుగా గైనకాలజిస్టు లేనందున స్కానింగ్‌ మిషన్‌ను ఉపయోగించడంలేదు.

* అనంతపురం సర్వజన ఆసుపత్రిలో ఎక్స్‌రే తీసినా రోగులకు ఫిల్మ్‌లు ఇవ్వడం లేదు. సెల్‌ఫోన్‌ ఫొటోలతో సరిపెడుతున్నారు. ఆసుపత్రిలోని మూడు ఎక్స్‌రే యంత్రాలు పాడైపోయాయి. ఓ యంత్రానికి వారంటీ ఉన్నా.. ఏజెన్సీ వారు ముందుకు రాకపోవడంతో బాగు చేయడంలేదు.

* ‘పరికరాల నిర్వహణ కోసం టెండర్ల ప్రక్రియ మొదలైంది. సంస్థ ఎంపిక జరిగిన స్వల్ప వ్యవధిలోనే పని చేయని యంత్రాలు, పరికరాలకు మరమ్మతులు చేయిస్తాం’ అని అధికారులు వివరణ ఇస్తున్నారు.

ఇదీ చదవండి: శ్రీలంక సంక్షోభం.. రాజీనామా చేసిన మంత్రివర్గం

ప్రభుత్వాసుపత్రుల్లో వ్యాధి నిర్ధారణ యంత్రాలు, పరికరాలు పని చేయకపోవడంతో రోగులు అవస్థలు పడుతున్నారు. ప్రైవేటు కేంద్రాల్లో పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తుండటంతో రోగులు ఆర్థికంగా నష్టపోతున్నారు. పలు ఆసుపత్రుల్లో యంత్రాలు పని చేస్తున్నా.. సాంకేతిక నిపుణులు, రోగులను చూడాల్సిన వైద్యులు లేనందున వాటివల్ల ఉపయోగం కనిపించడం లేదు. నిర్వహణ కోసం తగిన నిధులు లేకపోవడం, పర్యవేక్షణ లోపంవల్ల యంత్రాలు మొరాయించడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మరమ్మతుల కోసం సాంకేతిక నిపుణులను పిలుస్తున్నా.. చెల్లింపుల్లో జాప్యం కారణంగా వారి నుంచి సహకారం లభించడం లేదని ఆసుపత్రుల వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. అన్ని రకాల ఆసుపత్రుల్లో కలిపి వేల సంఖ్యలోనే యంత్రాలు, ఆపరేషన్‌ థియేటర్లలోని పరికరాలు పనిచేయని పరిస్థితుల్లో ఉన్నాయని తెలిసింది.

* తూర్పుగోదావరి జిల్లాలో ప్రధానమైన రాజమహేంద్రవరం జిల్లా ఆసుపత్రిలో రెండేళ్ల నుంచి సి.టి.స్కానర్‌ పని చేయడంలేదు.

* గుంటూరు జిల్లా తెనాలి జిల్లా ప్రభుత్వాసుపత్రిలోని సి.టి.స్కానర్‌ పరిస్థితి అంతే.

* పశ్చిమగోదావరి జిల్లా భీమవరం ప్రభుత్వాసుపత్రిలో రెండు స్కానింగ్‌ పరికరాలున్నాయి. వీటిలో ఒకటి అధునాతనమైనది. రేడియాలజిస్టులు లేనందున ఇవి రెండు ఉపయోగించే పరిస్థితులు కనిపించడం లేదు.

* కడప జిల్లా రాజంపేటలోని ఆసుపత్రిలో చాలాకాలంగా పెద్ద ఎక్స్‌రే యంత్రం పనిచేయడం లేదు. దీంతో మొబైల్‌ యంత్రంతో సరిపెడుతున్నారు. ప్రొద్దుటూరు జిల్లా ప్రభుత్వాసుపత్రిలో అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ యంత్రం మూలకు చేరింది. సిబ్బంది కొరతతో వినియోగించడం లేదు. ఇక్కడున్న రేడియాలజిస్టు సెలవుపై వెళ్లి తిరిగిరాలేదు. 8 నెలలు దాటినా మరొకరిని నియమించలేదు. ముఖ్యంగా గర్భిణులకు తీవ్ర ఇబ్బందిగా మారింది.

* చిత్తూరు జిల్లా పుత్తూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో గతేడాది డిసెంబరు నుంచి ఎక్స్‌రే యంత్రం పని చేయడం లేదు.

* పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్కానింగ్‌ పరికరం గత కొన్నేళ్ల నుంచి పని చేయడం లేదు. ఇక్కడ ఐదేళ్లుగా గైనకాలజిస్టు పోస్టు ఖాళీగా ఉంది. తణుకు ఆసుపత్రిలో రేడియాలజిస్టు లేనందున రెండు నెలల నుంచి స్కానింగ్‌ సెంటర్‌ తలుపులకు తాళాలు పడ్డాయి. పోలవరం సామాజిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు లేనందున స్కానింగ్‌ మిషన్‌ను ఉపయోగించడం లేదు. ఆచంట సామాజిక ఆరోగ్య కేంద్రంలో గడిచిన మూడేళ్లుగా గైనకాలజిస్టు లేనందున స్కానింగ్‌ మిషన్‌ను ఉపయోగించడంలేదు.

* అనంతపురం సర్వజన ఆసుపత్రిలో ఎక్స్‌రే తీసినా రోగులకు ఫిల్మ్‌లు ఇవ్వడం లేదు. సెల్‌ఫోన్‌ ఫొటోలతో సరిపెడుతున్నారు. ఆసుపత్రిలోని మూడు ఎక్స్‌రే యంత్రాలు పాడైపోయాయి. ఓ యంత్రానికి వారంటీ ఉన్నా.. ఏజెన్సీ వారు ముందుకు రాకపోవడంతో బాగు చేయడంలేదు.

* ‘పరికరాల నిర్వహణ కోసం టెండర్ల ప్రక్రియ మొదలైంది. సంస్థ ఎంపిక జరిగిన స్వల్ప వ్యవధిలోనే పని చేయని యంత్రాలు, పరికరాలకు మరమ్మతులు చేయిస్తాం’ అని అధికారులు వివరణ ఇస్తున్నారు.

ఇదీ చదవండి: శ్రీలంక సంక్షోభం.. రాజీనామా చేసిన మంత్రివర్గం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.