ETV Bharat / state

మోచంపేట షావలీ దర్గా స్థల వివాదం.. ఉప ముఖ్యమంత్రి హస్తం ఉందని ఆరోపణలు

author img

By

Published : Feb 17, 2023, 9:12 PM IST

Tension at Kadapa Shawali Dargah: కడపలోని మోచంపేట షావలీ దర్గా స్థల వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. దర్గా స్థలాన్ని వైసీపీ నాయకులు ఆక్రమించి ప్రహరీ గోడ నిర్మించారని ముస్లిం పెద్దలు ఆందోళన చేపట్టారు. దర్గా స్థలానికి ర్యాలీగా వచ్చిన ముస్లింలను పోలీసులు అడ్డుకోవడంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. కొంతమంది ముస్లింలను పోలీసులు అరెస్టు చేశారు. హైకోర్టులో స్టే ఉన్నా.. దర్గా స్థలంలో ప్రహరీ గోడ ఏ విధంగా నిర్మిస్తారని ముస్లిం పెద్దలు ప్రశ్నించారు.

Tension at Kadapa Shawali Dargah
Tension at Kadapa Shawali Dargah

Tension at Kadapa Shawali Dargah: కడప నగరంలోని మోచంపేట షావలీ దర్గాకు, రామకృష్ణ పాఠశాలకు సంబంధించిన స్థల వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. దర్గా స్థలంలో వైసీపీ బడా నాయకులు, ప్రభుత్వం అండతో ప్రహరీ గోడ నిర్మించి ఆక్రమించారని ముస్లిం పెద్దలు ఆందోళన చేపట్టారు. ఈ రోజు పెద్ద ఎత్తున ముస్లింలు మసీదుల నుంచి ర్యాలీలు, ధర్నాలు చేస్తారనే సమాచారంతో ఉదయం 11 గంటల నుంచి భారీగా పోలీసులు దర్గా స్థలం వద్ద మోహరించారు. బాష్పవాయువు గోళాలు, ముళ్లకంచెలను సైతం సిద్ధం చేశారు. కడప డీఎస్పీ వెంకటశివారెడ్డి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అక్కడే ఉండి బందోబస్తు పర్యవేక్షించారు.

కొందరు ముస్లిం పెద్దలు దర్గా స్థలం వద్దకు ర్యాలీగా వస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. వారితో వాగ్వాదం చేసి బలవంతంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్​కు తరలించారు. వైసీపీ ప్రభుత్వం అండతో.. కడపకు చెందిన ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా ప్రోద్భలంతోనే అక్రమంగా ప్రహరీగోడ నిర్మించారని దర్గా ప్రతినిధులు ఆరోపించారు. హైకోర్టులో స్టే ఉన్నా దర్గా స్థలంలో ప్రహరీ గోడ ఏవిధంగా నిర్మిస్తారని ప్రశ్నించారు. వైసీపీకి చెందిన పెద్దల హస్తం ఉండటంతోనే పోలీసులు భారీగా మోహరించారని.. మరోసారి ఆందోళన చేసి దర్గా స్థలాన్ని కాపాడుకుంటామని ముస్లింలు హెచ్చరించారు.

కడప రామకృష్ణ కళాశాల సమీపంలోని దర్గా ఆవరణలో ఉన్న ఖాళీ స్థలం కోసం గత కొద్దిరోజుల నుంచి ఇరువర్గాల మధ్య వివాదాలు తలెత్తుతున్నాయి. ఓ వర్గం వారు ఇది దర్గా స్థలమని.. మరో వర్గం వారు రామకృష్ణ కళాశాలకు సంబంధించిన స్థలమంటూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఓవర్గానికి సంబంధించి సజ్జల రామకృష్ణారెడ్డి, ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాషాలు దగ్గరుండి దర్గా స్థలాన్ని కబ్జా చేస్తున్నారని ముస్లిం వర్గం నాయకులు ఆరోపించారు.

కడప మోచంపేట షావలీ దర్గా స్థల వివాదం.. ఉప ముఖ్యమంత్రి హస్తం ఉందని ఆరోపణలు

ఇవీ చదంవడి:

Tension at Kadapa Shawali Dargah: కడప నగరంలోని మోచంపేట షావలీ దర్గాకు, రామకృష్ణ పాఠశాలకు సంబంధించిన స్థల వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. దర్గా స్థలంలో వైసీపీ బడా నాయకులు, ప్రభుత్వం అండతో ప్రహరీ గోడ నిర్మించి ఆక్రమించారని ముస్లిం పెద్దలు ఆందోళన చేపట్టారు. ఈ రోజు పెద్ద ఎత్తున ముస్లింలు మసీదుల నుంచి ర్యాలీలు, ధర్నాలు చేస్తారనే సమాచారంతో ఉదయం 11 గంటల నుంచి భారీగా పోలీసులు దర్గా స్థలం వద్ద మోహరించారు. బాష్పవాయువు గోళాలు, ముళ్లకంచెలను సైతం సిద్ధం చేశారు. కడప డీఎస్పీ వెంకటశివారెడ్డి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అక్కడే ఉండి బందోబస్తు పర్యవేక్షించారు.

కొందరు ముస్లిం పెద్దలు దర్గా స్థలం వద్దకు ర్యాలీగా వస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. వారితో వాగ్వాదం చేసి బలవంతంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్​కు తరలించారు. వైసీపీ ప్రభుత్వం అండతో.. కడపకు చెందిన ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా ప్రోద్భలంతోనే అక్రమంగా ప్రహరీగోడ నిర్మించారని దర్గా ప్రతినిధులు ఆరోపించారు. హైకోర్టులో స్టే ఉన్నా దర్గా స్థలంలో ప్రహరీ గోడ ఏవిధంగా నిర్మిస్తారని ప్రశ్నించారు. వైసీపీకి చెందిన పెద్దల హస్తం ఉండటంతోనే పోలీసులు భారీగా మోహరించారని.. మరోసారి ఆందోళన చేసి దర్గా స్థలాన్ని కాపాడుకుంటామని ముస్లింలు హెచ్చరించారు.

కడప రామకృష్ణ కళాశాల సమీపంలోని దర్గా ఆవరణలో ఉన్న ఖాళీ స్థలం కోసం గత కొద్దిరోజుల నుంచి ఇరువర్గాల మధ్య వివాదాలు తలెత్తుతున్నాయి. ఓ వర్గం వారు ఇది దర్గా స్థలమని.. మరో వర్గం వారు రామకృష్ణ కళాశాలకు సంబంధించిన స్థలమంటూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఓవర్గానికి సంబంధించి సజ్జల రామకృష్ణారెడ్డి, ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాషాలు దగ్గరుండి దర్గా స్థలాన్ని కబ్జా చేస్తున్నారని ముస్లిం వర్గం నాయకులు ఆరోపించారు.

కడప మోచంపేట షావలీ దర్గా స్థల వివాదం.. ఉప ముఖ్యమంత్రి హస్తం ఉందని ఆరోపణలు

ఇవీ చదంవడి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.