ETV Bharat / state

ఒకే కుటుంబంలో ఆరుగురికి కరోనా

author img

By

Published : Jun 23, 2020, 8:49 AM IST

ఒకే ఇంట్లో ఆరుగురికి కరోనా పాజిటివ్​గా రావటంతో కడప జిల్లా జమ్మలమడుగులో కలకలం రేపుతోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఆ ప్రాంతంలో పారిశుద్ధ్య పనులు చేపట్టారు.

ఒకే కుటుంబంలో ఆరుగురికి కరోనా
ఒకే కుటుంబంలో ఆరుగురికి కరోనా

కడప జిల్లా జమ్మలమడుగులో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురికి కరోనా పాజిటివ్​గా నిర్థరణ కావటంతో అక్కడ ప్రజలంతా ఆందోళనకు గురవుతున్నారు. ఈ నెల 18న జమ్మలమడుగు నాగుల కట్ట, టీచర్స్ కాలనీలో ఇద్దరికి కరోనా సోకినట్లు తేలింది. బాధితులను ప్రొద్దుటూరు కొవిడ్ ఆసుపత్రికి తరలించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు, ఆ ప్రాంతాల్లో ఉన్న స్థానికులకు కరోనా పరీక్షలు నిర్వహించగా... ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు వైరస్ బారిన పడినట్లు వెల్లడించారు.

నియోజకవర్గంలో ఒక్క కొండాపూరం మినహా మిగిలిన 5 మండలాల్లో కరోనా కేసులు నమోదయ్యాయి. జిల్లాలో మెుత్తం 129 కరోనా పాజిటివ్ బాధితులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

కడప జిల్లా జమ్మలమడుగులో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురికి కరోనా పాజిటివ్​గా నిర్థరణ కావటంతో అక్కడ ప్రజలంతా ఆందోళనకు గురవుతున్నారు. ఈ నెల 18న జమ్మలమడుగు నాగుల కట్ట, టీచర్స్ కాలనీలో ఇద్దరికి కరోనా సోకినట్లు తేలింది. బాధితులను ప్రొద్దుటూరు కొవిడ్ ఆసుపత్రికి తరలించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు, ఆ ప్రాంతాల్లో ఉన్న స్థానికులకు కరోనా పరీక్షలు నిర్వహించగా... ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు వైరస్ బారిన పడినట్లు వెల్లడించారు.

నియోజకవర్గంలో ఒక్క కొండాపూరం మినహా మిగిలిన 5 మండలాల్లో కరోనా కేసులు నమోదయ్యాయి. జిల్లాలో మెుత్తం 129 కరోనా పాజిటివ్ బాధితులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

ఇదీ చదవండి: కడప శివారులో కారు ప్రమాదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.