కమలాపురం మూడు రోడ్ల కూడలిలో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. కేంద్రం తీసుకొచ్చిన చట్టాలతో రైతులు తమ పొలాల్లో కూలీలుగా మారే ప్రమాదముందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి అన్నారు. అటువంటి చట్టాలు తీసుకొచ్చిన భాజపాకు.. వైకాపా, తెదేపాలు మద్దతివ్వడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి :