ETV Bharat / state

విధులు నిర్వహిస్తూనే ఆర్​పీఎఫ్​ కానిస్టేబుల్​ ఆత్మహత్య

author img

By

Published : Jan 31, 2020, 3:09 PM IST

విధి నిర్వహణలో ఉన్న ఓ ఆర్​పీఎఫ్ కానిస్టేబుల్ తన తుపాకీతో తానే కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కడప జిల్లా ఒంటిమిట్ట రైల్వే స్టేషన్​ సమీపంలో జరిగింది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

తుపాకితో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఆర్​పీఎఫ్ కానిస్టేబుల్
తుపాకితో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఆర్​పీఎఫ్ కానిస్టేబుల్

తుపాకితో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఆర్​పీఎఫ్ కానిస్టేబుల్

విధి నిర్వహణలో ఉన్న ఆర్​పీఎఫ్ కానిస్టేబుల్ తన తుపాకితో తానే కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కడప జిల్లా ఒంటిమిట్ట రైల్వే స్టేషన్​ సమీపంలో జరిగింది. ముంబై నుంచి చెన్నైకి వెళ్తున్న మెయిల్ ఎక్స్​ప్రెస్​​లో ఎస్.పన్వర్ భద్రతా విధులు నిర్వహిస్తున్నాడు. ఒంటిమిట్ట రైల్వే స్టేషన్ దాటిన తర్వాత అతను తన వద్ద ఉన్న తుపాకీతో ఛాతిపై కాల్చుకున్నాడు. గమినించిన తోటి సిబ్బంది వెంటనే నందలూరు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే పన్వర్​ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. రైల్వే అధికారులు మృతదేహాన్ని కడప రిమ్స్​కు తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. నందలూరు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: చెట్టుకు ఉరివేసుకొని విద్యార్థి అత్మహత్య

తుపాకితో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఆర్​పీఎఫ్ కానిస్టేబుల్

విధి నిర్వహణలో ఉన్న ఆర్​పీఎఫ్ కానిస్టేబుల్ తన తుపాకితో తానే కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కడప జిల్లా ఒంటిమిట్ట రైల్వే స్టేషన్​ సమీపంలో జరిగింది. ముంబై నుంచి చెన్నైకి వెళ్తున్న మెయిల్ ఎక్స్​ప్రెస్​​లో ఎస్.పన్వర్ భద్రతా విధులు నిర్వహిస్తున్నాడు. ఒంటిమిట్ట రైల్వే స్టేషన్ దాటిన తర్వాత అతను తన వద్ద ఉన్న తుపాకీతో ఛాతిపై కాల్చుకున్నాడు. గమినించిన తోటి సిబ్బంది వెంటనే నందలూరు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే పన్వర్​ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. రైల్వే అధికారులు మృతదేహాన్ని కడప రిమ్స్​కు తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. నందలూరు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: చెట్టుకు ఉరివేసుకొని విద్యార్థి అత్మహత్య

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.