ETV Bharat / state

ప్రభుత్వ స్థలాన్ని పరిరక్షించాలంటూ రిలే దీక్షలు - ప్రభుత్వ స్థలాన్ని పరిరక్షించాలని రిలే నిరాహార దీక్షలు

ప్రభుత్వ జూనియర్ కళాశాల స్థలాన్ని కాపాడాలంటూ... కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం, జేఏసీ నాయకులు రాయచోటి రెవెన్యూ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలు చేపట్టారు.

Riley fasts to conserve public space
రాయచోటి ప్రభుత్వ కళాశాల స్థలాన్నికాపాడాలని రిలే నిరాహార దీక్షలు
author img

By

Published : Dec 21, 2019, 10:46 PM IST

రాయచోటి ప్రభుత్వ కళాశాల స్థలాన్నికాపాడాలని రిలే నిరాహార దీక్షలు

కడప జిల్లా రాయచోటి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల స్థలాన్ని కాపాడాలంటూ... కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం, విద్యార్థి జేఏసీ నాయకులు శనివారం రెవిన్యూ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే కలిసి ఎన్నో ఏళ్ల చరిత్ర గల ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానాన్ని ఒక వర్గానికి కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని వారు ఆరోపించారు. గతంలోనే హైకోర్టు ఆ స్థలం కళాశాలకు చెందినదిగా తీర్పు ఇచ్చినా... దాన్ని తుంగలో తొక్కి జీవో తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారని వారు ఆరోపించారు. ఆ స్థలంలో మహిళా డిగ్రీ పీజీ కళాశాల, ఉర్దూ కళాశాల నిర్మాణం చేపట్టాలని కోరారు. ఇది వరకే ఆరు ఎకరాలు అన్యాక్రాంతం అయిపోయిందని... ఇప్పుడు మరో నాలుగు ఎకరాలు ఇవ్వడం దారుణమని ఆవేదన చెందారు. కళాశాల మైదానం చుట్టూ వెంటనే ప్రహరీ నిర్మించి పరిరక్షించాలని వారు డిమాండ్ చేశారు. భాజపా, ఇతర ప్రజాసంఘాల నాయకులు మద్దతుగా దీక్షలో కూర్చున్నారు.

రాయచోటి ప్రభుత్వ కళాశాల స్థలాన్నికాపాడాలని రిలే నిరాహార దీక్షలు

కడప జిల్లా రాయచోటి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల స్థలాన్ని కాపాడాలంటూ... కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం, విద్యార్థి జేఏసీ నాయకులు శనివారం రెవిన్యూ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే కలిసి ఎన్నో ఏళ్ల చరిత్ర గల ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానాన్ని ఒక వర్గానికి కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని వారు ఆరోపించారు. గతంలోనే హైకోర్టు ఆ స్థలం కళాశాలకు చెందినదిగా తీర్పు ఇచ్చినా... దాన్ని తుంగలో తొక్కి జీవో తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారని వారు ఆరోపించారు. ఆ స్థలంలో మహిళా డిగ్రీ పీజీ కళాశాల, ఉర్దూ కళాశాల నిర్మాణం చేపట్టాలని కోరారు. ఇది వరకే ఆరు ఎకరాలు అన్యాక్రాంతం అయిపోయిందని... ఇప్పుడు మరో నాలుగు ఎకరాలు ఇవ్వడం దారుణమని ఆవేదన చెందారు. కళాశాల మైదానం చుట్టూ వెంటనే ప్రహరీ నిర్మించి పరిరక్షించాలని వారు డిమాండ్ చేశారు. భాజపా, ఇతర ప్రజాసంఘాల నాయకులు మద్దతుగా దీక్షలో కూర్చున్నారు.

ఇవీ చదవండి:

మా పాఠశాలకు భవనం కావాలి.. అధికారులూ స్పందించండి!

Intro:కడప జిల్లా రాయచోటి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల స్థలాన్ని కాపాడాలంటూ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం విద్యార్థి జేఏసీ నాయకులు శనివారం రెవెన్యూ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలు చేపట్టారు ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే కలిసి ఎన్నో ఏళ్ల చరిత్ర గల ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానాన్ని ఒక వర్గానికి కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని వారు దుయ్యబట్టారు గతంలోనే హైకోర్టు ఆ స్థలం కళాశాల కు చెందినది గా తీర్పు ఇచ్చినా దాన్ని తుంగలో తొక్కి జీవో తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారని వారు ఆరోపించారు ఆ స్థలంలో మహిళా డిగ్రీ పీజీ కళాశాలలో ఉర్దూ కళాశాల నిర్మాణం చేపట్టాలని కోరారు ఇదివరకే ఆరు ఎకరాలు అన్యాక్రాంత అయిపోయిందని ఇప్పుడు మరో నాలుగు ఎకరాలు ఇవ్వడం దారుణమన్నారు కళాశాల మైదానం చుట్టూ వెంటనే ప్రహరీ గోడ నిర్మించి పరిరక్షించాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఓ పి డి ఆర్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈశ్వర్ పౌర హక్కుల సంఘం నాయకుడు శివ శంకర్ భాజపా నాయకులు శ్రీనివాస్ కుమార్ రాజులు ప్రసంగించారు భాజపా ఇతర ప్రజాసంఘాల నాయకులు మద్దతుగా దీక్షలో కూర్చున్నారు


Body:బైట్స్ 1.ఈశ్వర్ ర్ ఓ పి డి ఆర్ రాష్ట్ర సహాయ కార్యదర్శి
2.శివ శంకర్ పౌరహక్కుల సంఘం నాయకుడు
3. శ్రీనివాస్ కుమార్ రాజు బిజెపి నాయకుడు


Conclusion:ప్రభుత్వ స్థలాన్ని పరిరక్షించాలని రిలే నిరాహార దీక్షలు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.