ETV Bharat / state

ఇద్దరు ఎర్రచందనం స్మగ్లర్లపై పీడీ యాక్ట్ నమోదు

author img

By

Published : Nov 19, 2020, 4:37 PM IST

కడప జిల్లాకు చెందిన ఇద్దరు ఎర్రచందనం స్మగ్లర్లపై పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ అన్బురాజన్​ తెలిపారు. 2015 నుంచి అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్లతో సంబంధాలు కొనసాగిస్తూ...దుంగలను అక్రమంగా రవాణా చేస్తుండేవారని పేర్కొన్నారు. ప్రస్తుతం వీరిద్దరూ కడప కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్నారని చెప్పారు.

red sanders smugglers
red sanders smugglers

పేరుమోసిన ఇద్దరు ఎర్రచందనం స్మగ్లర్లపై పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్​ తెలిపారు. కడప జిల్లా చాపాడు మండలానికి చెందిన స్మగ్లర్​ లాల్​ బాషాపై 15 కేసులు, అదే ప్రాంతానికి జాకీర్​పై 12 కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. వీరిద్దరూ 2015 నుంచి అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్లతో సంబంధాలు కొనసాగిస్తూ.. దంగులను అక్రమంగా రవాణా చేసేవారని వివరించారు.

కర్ణాటక, తమిళనాడు తదితర ప్రాంతాల్లోనూ ఎర్రచందనం దందా సాగించేవారని అన్నారు. వీరిని గతంలోనే పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారని పేర్కొన్నారు. ప్రస్తుతం వీరిద్దరూ కడప కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్నారని చెప్పారు. ఈ మేరకు వీరిపై పీడీ యాక్ట్ నమోదు చేశామని, సంబంధిత ఉత్తర్వులు జారీ చేశామని తెలిపారు.

పేరుమోసిన ఇద్దరు ఎర్రచందనం స్మగ్లర్లపై పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్​ తెలిపారు. కడప జిల్లా చాపాడు మండలానికి చెందిన స్మగ్లర్​ లాల్​ బాషాపై 15 కేసులు, అదే ప్రాంతానికి జాకీర్​పై 12 కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. వీరిద్దరూ 2015 నుంచి అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్లతో సంబంధాలు కొనసాగిస్తూ.. దంగులను అక్రమంగా రవాణా చేసేవారని వివరించారు.

కర్ణాటక, తమిళనాడు తదితర ప్రాంతాల్లోనూ ఎర్రచందనం దందా సాగించేవారని అన్నారు. వీరిని గతంలోనే పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారని పేర్కొన్నారు. ప్రస్తుతం వీరిద్దరూ కడప కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్నారని చెప్పారు. ఈ మేరకు వీరిపై పీడీ యాక్ట్ నమోదు చేశామని, సంబంధిత ఉత్తర్వులు జారీ చేశామని తెలిపారు.

ఇదీ చదవండి

మంత్రి కొడాలి నానిపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన ఎస్‌ఈసీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.