కడప జిల్లా ఒంటిమిట్ట, సిద్దవటం అటవీ ప్రాంతాల్లో పోలీసులు, అటవీ శాఖ సిబ్బంది సంయుక్తంగా ఎర్రచందనం అక్రమరవాణాపై దాడులు జరిపారు. పది ఎర్రచందనం దుంగలు సహా మొత్తం ఎనిమిది మందిని అరెస్టు చేశారు. పక్కా సమాచారంతో ఈ దాడులు చేశామని రాజంపేట డీఎస్పీ నారాయణస్వామిరెడ్డి తెలిపారు. ఈ దాడుల్లో ఒంటిమిట్ట సీఐ హనుమంతునాయక్, ఎస్ఐ అమర్నాథ్ రెడ్డి, అటవీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
ఇదీ చూడండి..