ETV Bharat / state

కిక్కు కోసం శానిటైజర్ తాగి బలవుతున్న ప్రాణాలు - కడప లో శానిటైజర్ తాగి ముగ్గురు మృతి

మద్యం మత్తు నిండు ప్రాణాలను బలికొంటుంది. లాక్‌డౌన్‌ వల్ల మద్యం లభించకపోవటం, ధర ఎక్కువగా ఉండటంతో మందుబాబులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కిక్కు కోసం చౌకగా లభించే శానిటైజర్‌ తాగి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ప్రకాశం జిల్లాలో 14మంది మృతి చెందగా..తాజాగా కడప జిల్లాలో మరో ముగ్గురు బలయ్యారు.

peoples drinking sanitaizer at kadapa district
కిక్కు కోసం శానిటైజర్..బలవుతున్న ప్రాణాలు
author img

By

Published : Aug 3, 2020, 8:38 PM IST

కిక్కు కోసం శానిటైజర్..బలవుతున్న ప్రాణాలు

ప్రకాశం జిల్లాలో శానిటైజర్‌ తాగి 14 మంది మృతి చెందటం కలకలం రేపింది. కరోనా వ్యాప్తి దృష్ట్యా..కురిచేడుతో పాటు చుట్టుపక్క ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ విధించటంతో..మద్యం ప్రియులకు మందు దొరకడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో చౌకగా లభ్యమయ్యే శానిటైజర్​ను మందుబాబులు తాగుతున్నారు. సుమారు 20 మంది ఇదే అలవాటుగా చేసుకున్నారు. వీరిలో 14 మంది మరణించగా..మరికొంత మంది అస్వస్థతకు గురయ్యారు. మద్యం ధరలు అధికంగా ఉండటం వల్లే..శానిటైజర్‌ తాగుతున్నామని మందుబాబులు చెబుతున్నారు.

మద్యం మత్తుకు కడప జిల్లాలో రెండు నెలల వ్యవధిలోనే ఆరుగురు బలయ్యారు. పెండ్రిమర్రిలో ముగ్గురు, కడపలో ఒకరు, చెన్నూరులో ఇద్దరు శానిటైజర్ తాగి మృతి చెందారు. ఘటనపై దర్యాప్తు చేసిన పోలీసులు..సుమారు 30మంది శానిటైజర్‌ తాగుతున్నట్లు గుర్తించారు. ఇప్పటికే కొంత మంది మత్తు బాబులకు, ఔషధ దుకాణదారులను పీఎస్‌కి పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు.

మద్యం ధరలు పెంచటం ద్వారా ఆ అలవాటుకు వ్యసనపరులను దూరం చేయొచ్చని ప్రభుత్వం భావించినా..మద్యం ప్రియులు మాత్రం అలవాటుని మానకపోగా...అడ్డదారులు వెతుకుని ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.


ఇదీ చదవండి: 'శానిటైజర్​ తాగి మృతి చెందిన కుటుంబాలకు రూ.10 లక్షలు ఇవ్వాలి'

కిక్కు కోసం శానిటైజర్..బలవుతున్న ప్రాణాలు

ప్రకాశం జిల్లాలో శానిటైజర్‌ తాగి 14 మంది మృతి చెందటం కలకలం రేపింది. కరోనా వ్యాప్తి దృష్ట్యా..కురిచేడుతో పాటు చుట్టుపక్క ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ విధించటంతో..మద్యం ప్రియులకు మందు దొరకడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో చౌకగా లభ్యమయ్యే శానిటైజర్​ను మందుబాబులు తాగుతున్నారు. సుమారు 20 మంది ఇదే అలవాటుగా చేసుకున్నారు. వీరిలో 14 మంది మరణించగా..మరికొంత మంది అస్వస్థతకు గురయ్యారు. మద్యం ధరలు అధికంగా ఉండటం వల్లే..శానిటైజర్‌ తాగుతున్నామని మందుబాబులు చెబుతున్నారు.

మద్యం మత్తుకు కడప జిల్లాలో రెండు నెలల వ్యవధిలోనే ఆరుగురు బలయ్యారు. పెండ్రిమర్రిలో ముగ్గురు, కడపలో ఒకరు, చెన్నూరులో ఇద్దరు శానిటైజర్ తాగి మృతి చెందారు. ఘటనపై దర్యాప్తు చేసిన పోలీసులు..సుమారు 30మంది శానిటైజర్‌ తాగుతున్నట్లు గుర్తించారు. ఇప్పటికే కొంత మంది మత్తు బాబులకు, ఔషధ దుకాణదారులను పీఎస్‌కి పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు.

మద్యం ధరలు పెంచటం ద్వారా ఆ అలవాటుకు వ్యసనపరులను దూరం చేయొచ్చని ప్రభుత్వం భావించినా..మద్యం ప్రియులు మాత్రం అలవాటుని మానకపోగా...అడ్డదారులు వెతుకుని ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.


ఇదీ చదవండి: 'శానిటైజర్​ తాగి మృతి చెందిన కుటుంబాలకు రూ.10 లక్షలు ఇవ్వాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.