ETV Bharat / state

వ్యవసాయ ప్రత్యేకం.. సేంద్రీయ సాగుతో అధిక దిగుబడులు

author img

By

Published : Aug 21, 2020, 9:36 PM IST

వ్యవసాయంలో సేంద్రీయ పద్ధతులను ఉపయోగించి మంచి దిగుబడులు సాధిస్తున్నారు కడప జిల్లా రైతులు. పశువుల వ్యర్థాలు, ఆకులు, వేప, గానుగ గింజలు లాంటి పదార్థాలతో తయారుచేసిన జీవామృతం వాడుతూ పంటలు పండిస్తున్నారు. తెగుళ్ల నివారణకు సహజసిద్ధ పద్ధతులను ఉపయోగిస్తూ ఆరోగ్యకరమైన పంటను అందిస్తున్నారు. ప్రభుత్వమూ చేయూతనిస్తూ మరి కొంతమంది రైతులను సేంద్రీయసాగు దిశగా ప్రోత్సహిస్తోంది. కడప జిల్లాలో సేంద్రీయసాగుపై ప్రత్యేక కథనం..

organic agriculture in kadapa district
సేంద్రీయ వ్యవసాయం

కడప జిల్లాలో సేంద్రీయ వ్యవసాయం ద్వారా ఉద్యాన పంటల్లో అధిక దిగుబడులు సాధిస్తున్నారు రైతులు. జిల్లాలో సుమారు 4 లక్షల హెక్టార్లలో వ్యవసాయ భూములు ఉండగా.. అందులో లక్ష హెక్టార్లలో మెట్ట భూమి ఉంది. ఇందులో ఆరుతడి పంటల కింద మామిడి, టమాట, బొప్పాయి, చీనీ వంటి తోటలు సాగు చేస్తున్నారు. ఇందులో రసాయనిక మందులకు బదులు సహజసిద్ధంగా తయారుచేసిన జీవామృతం వాడుతూ మంచి దిగుబడులు పొందుతున్నారు.

జిల్లా ఉద్యానశాఖ, వ్యవసాయ అనుబంధ స్వచ్ఛంద సంస్థలు సేంద్రీయ విధానం అమలుచేసేలా రైతు మిత్ర సంఘాలు ఏర్పాటు చేయించి అన్నదాతలకు సూచనలు ఇస్తున్నారు. మార్కెట్​లో ఎప్పుడూ డిమాండ్ ఉండే బొప్పాయి పంటను జిల్లాలో అత్యధికంగా సాగుచేశారు. రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు, పులివెందుల నియోజకవర్గాల్లో సుమారు 10 వేల ఎకరాల్లో బొప్పాయి సాగు ఉంది.

బీవీఆర్ ఆర్గానిక్ అనే స్వచ్ఛంద సంస్థ రైతులకు దైవం అనే బొప్పాయి రకం విత్తనాలు అందించి.. వాటి సాగుకు అవసరమైన మెళకువలను వ్యవసాయ మిత్రల ద్వారా రైతులకు సూచించారు. ఈ పద్ధతుల్లో సాగుచేసి సంబేపల్లి మండలం మోటకట్లలో నరసింహులు అనే రైతు 10 ఎకరాల్లో బొప్పాయి సాగుచేసి మంచి దిగుబడులు సాధించాడు. సేంద్రీయ పద్ధతిలో సాగు చేయటంతో కొనుగోలుదారులు తోట వద్దకే వచ్చి పంటను కొంటున్నట్లు చెప్పారు. తమ ఆర్గానిక్ ద్వారా వివిధ రకాల పంటలను 800 మంది అన్నదాతలు సాగు చేశారని బీవీఆర్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. సేంద్రీయ పద్ధతులు అవలంబించడం ద్వారా ఆరోగ్యవంతమైన దిగుబడులు పొందవచ్చని వివరించారు.

కడప జిల్లాలో సేంద్రీయ వ్యవసాయం ద్వారా ఉద్యాన పంటల్లో అధిక దిగుబడులు సాధిస్తున్నారు రైతులు. జిల్లాలో సుమారు 4 లక్షల హెక్టార్లలో వ్యవసాయ భూములు ఉండగా.. అందులో లక్ష హెక్టార్లలో మెట్ట భూమి ఉంది. ఇందులో ఆరుతడి పంటల కింద మామిడి, టమాట, బొప్పాయి, చీనీ వంటి తోటలు సాగు చేస్తున్నారు. ఇందులో రసాయనిక మందులకు బదులు సహజసిద్ధంగా తయారుచేసిన జీవామృతం వాడుతూ మంచి దిగుబడులు పొందుతున్నారు.

జిల్లా ఉద్యానశాఖ, వ్యవసాయ అనుబంధ స్వచ్ఛంద సంస్థలు సేంద్రీయ విధానం అమలుచేసేలా రైతు మిత్ర సంఘాలు ఏర్పాటు చేయించి అన్నదాతలకు సూచనలు ఇస్తున్నారు. మార్కెట్​లో ఎప్పుడూ డిమాండ్ ఉండే బొప్పాయి పంటను జిల్లాలో అత్యధికంగా సాగుచేశారు. రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు, పులివెందుల నియోజకవర్గాల్లో సుమారు 10 వేల ఎకరాల్లో బొప్పాయి సాగు ఉంది.

బీవీఆర్ ఆర్గానిక్ అనే స్వచ్ఛంద సంస్థ రైతులకు దైవం అనే బొప్పాయి రకం విత్తనాలు అందించి.. వాటి సాగుకు అవసరమైన మెళకువలను వ్యవసాయ మిత్రల ద్వారా రైతులకు సూచించారు. ఈ పద్ధతుల్లో సాగుచేసి సంబేపల్లి మండలం మోటకట్లలో నరసింహులు అనే రైతు 10 ఎకరాల్లో బొప్పాయి సాగుచేసి మంచి దిగుబడులు సాధించాడు. సేంద్రీయ పద్ధతిలో సాగు చేయటంతో కొనుగోలుదారులు తోట వద్దకే వచ్చి పంటను కొంటున్నట్లు చెప్పారు. తమ ఆర్గానిక్ ద్వారా వివిధ రకాల పంటలను 800 మంది అన్నదాతలు సాగు చేశారని బీవీఆర్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. సేంద్రీయ పద్ధతులు అవలంబించడం ద్వారా ఆరోగ్యవంతమైన దిగుబడులు పొందవచ్చని వివరించారు.

ఇవీ చదవండి...

పవర్​ బ్యాంక్ ఆర్డర్ చేస్తే.. అమెజాన్​ రెడ్​ మీ ఫోన్​ ఇచ్చింది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.