ETV Bharat / state

తరుమకొస్తున్న 'నివర్​'.. జిల్లా యంత్రాంగం అప్రమత్తం

author img

By

Published : Nov 25, 2020, 6:55 AM IST

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన నివర్‌ తుపాను.. కడప జిల్లాపై తీవ్రంగా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ నెల 25, 26వ తేదీల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ, అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ, విపత్తు నిర్వహణ విభాగం తెలిపింది. తీరం వెంబడి గంటకు 45-65 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం ముందు జాగ్రత్త చర్యల్లో నిమగ్నమైంది.

nivar cyclone facing acitons started in kadapa district
nivar cyclone facing acitons started in kadapa district

రాష్ట్రంలోకి ప్రవేశించనున్న "నివర్" తుపానును ఎదుర్కొనేందుకు కడప జిల్లా వ్యాప్తంగా అన్ని మండల స్థాయి అధికారులు ముందస్తు ఏర్పాట్లను సిద్ధం చేసుకోవాలని ఇంఛార్జ్ కలెక్టర్‌ గౌతమి ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే కలెక్టర్‌ కార్యాలయంలో కంట్రోల్‌ రూం 08562-245259 ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నివర్​ తుపానుపై ఎస్పీ అన్బురాజన్‌, సంయుక్త కలెక్టర్‌ సాయికాంత్‌వర్మతో కలిసి జిల్లా సచివాలయం నుంచి తహసీల్దార్లు, పురపాలక కమిషనర్లతో సమీక్షించారు. ప్రతి తహసీల్దారు కార్యాలయ పరిధిలో కంట్రోల్‌ రూంలు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. అధికారులంతా అప్రమత్తంగా ఉండి క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. కాలువలు, నదుల పరివాహక ప్రాంతాల వద్ద అప్రమత్తంగా ఉండాలని, ఎప్పుడు ఎలాంటి ఉపద్రవం వచ్చినా తక్షణమే సేవలందించే విధంగా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. రైతులు పంట విత్తనాలు విత్తే సమయాన్ని మరో రెండు, మూడు రోజులు వాయిదా వేసుకోవాలని సూచించారు.

లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి...

nivar cyclone facing acitons started in kadapa district
అంచనా వర్షపాతం

ఎలాంటి ప్రాణ, ఆస్తి, పంట నష్టం జరగకుండా సంబంధిత శాఖల అధికారులు ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించాం. పెన్నా, కుందూ పరివాహక, లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి. అవసరమైతే ఎగువ ప్రాంతాల్లో ఉన్న భవనాలకు, ప్రభుత్వం ఏర్పాటు చేసే శిబిరాల్లోకి తరలివెళ్లాలి. - మాలోల, డీఆర్వో, కడప

ఇదీ చదవండి:

ఆస్తి పన్ను మోత... ఇకపై రిజిస్ట్రేషన్ విలువ ఆధారంగా వసూలు

రాష్ట్రంలోకి ప్రవేశించనున్న "నివర్" తుపానును ఎదుర్కొనేందుకు కడప జిల్లా వ్యాప్తంగా అన్ని మండల స్థాయి అధికారులు ముందస్తు ఏర్పాట్లను సిద్ధం చేసుకోవాలని ఇంఛార్జ్ కలెక్టర్‌ గౌతమి ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే కలెక్టర్‌ కార్యాలయంలో కంట్రోల్‌ రూం 08562-245259 ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నివర్​ తుపానుపై ఎస్పీ అన్బురాజన్‌, సంయుక్త కలెక్టర్‌ సాయికాంత్‌వర్మతో కలిసి జిల్లా సచివాలయం నుంచి తహసీల్దార్లు, పురపాలక కమిషనర్లతో సమీక్షించారు. ప్రతి తహసీల్దారు కార్యాలయ పరిధిలో కంట్రోల్‌ రూంలు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. అధికారులంతా అప్రమత్తంగా ఉండి క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. కాలువలు, నదుల పరివాహక ప్రాంతాల వద్ద అప్రమత్తంగా ఉండాలని, ఎప్పుడు ఎలాంటి ఉపద్రవం వచ్చినా తక్షణమే సేవలందించే విధంగా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. రైతులు పంట విత్తనాలు విత్తే సమయాన్ని మరో రెండు, మూడు రోజులు వాయిదా వేసుకోవాలని సూచించారు.

లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి...

nivar cyclone facing acitons started in kadapa district
అంచనా వర్షపాతం

ఎలాంటి ప్రాణ, ఆస్తి, పంట నష్టం జరగకుండా సంబంధిత శాఖల అధికారులు ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించాం. పెన్నా, కుందూ పరివాహక, లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి. అవసరమైతే ఎగువ ప్రాంతాల్లో ఉన్న భవనాలకు, ప్రభుత్వం ఏర్పాటు చేసే శిబిరాల్లోకి తరలివెళ్లాలి. - మాలోల, డీఆర్వో, కడప

ఇదీ చదవండి:

ఆస్తి పన్ను మోత... ఇకపై రిజిస్ట్రేషన్ విలువ ఆధారంగా వసూలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.