ETV Bharat / state

ద్విచక్రవాహనాల దొంగ అరెస్ట్...13 బైక్​లు స్వాధీనం

ద్విచక్రవాహనాలను చాకచాక్యంగా చోరీ చేస్తున్న దొంగను కడప జిల్లా మైదకూరు పోలీసులు అరెస్ట్ చేశారు. అతని నుంచి 13 బైక్​లను స్వాధీనం చేసుకున్నారు.

author img

By

Published : Nov 10, 2020, 4:40 PM IST

Maidakuru police have arrested a thief for stealing two-wheelers.
ద్విచక్రవాహనాల దొంగ అరెస్ట్

కడప, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో ద్విచక్రవాహనాలను చోరీ చేస్తున్న దొంగను కడప జిల్లా మైదుకూరు పోలీసులు అరెస్ట్ చేశారు. కర్నూలు జిల్లా ఆలమూరుకు చెందిన వెంకటరమణ అనే వ్యక్తి గత కొంతకాలంగా ద్విచక్ర వాహనాలు దొంగతనం చేస్తున్నాడు. ఏ ప్రదేశంలోనైనా హ్యాండిల్ లాక్ చేయని బైక్​లు కనిపిస్తే చాకచక్యంగా వాటిని ఎత్తుకెళ్లడం పనిగా పెట్టుకున్నాడని జిల్లా ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. ఇతని వద్ద నుంచి 8 లక్షల రూపాయల విలువ చేసే 13 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామని ఆయన వెల్లడించారు. ఎక్కడైనా వాహనాలు నిలిపే సమయంలో లాక్ వేయడం మరవవద్దని జిల్లా ఎస్పీ సూచించారు.

కడప, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో ద్విచక్రవాహనాలను చోరీ చేస్తున్న దొంగను కడప జిల్లా మైదుకూరు పోలీసులు అరెస్ట్ చేశారు. కర్నూలు జిల్లా ఆలమూరుకు చెందిన వెంకటరమణ అనే వ్యక్తి గత కొంతకాలంగా ద్విచక్ర వాహనాలు దొంగతనం చేస్తున్నాడు. ఏ ప్రదేశంలోనైనా హ్యాండిల్ లాక్ చేయని బైక్​లు కనిపిస్తే చాకచక్యంగా వాటిని ఎత్తుకెళ్లడం పనిగా పెట్టుకున్నాడని జిల్లా ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. ఇతని వద్ద నుంచి 8 లక్షల రూపాయల విలువ చేసే 13 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామని ఆయన వెల్లడించారు. ఎక్కడైనా వాహనాలు నిలిపే సమయంలో లాక్ వేయడం మరవవద్దని జిల్లా ఎస్పీ సూచించారు.

ఇదీ చదవండి: టచ్ ఫోన్​కు ఆశపడ్డాడు.. కటకటాల పాలయ్యాడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.