ETV Bharat / state

మన బడి నాడు - నేడు పనులు పరిశీలించిన జేసీ - మన బడి నాడు-నేడు పనులు పరిశీలించిన జాయింట్ కలెక్టర్

కడప జిల్లా సుండుపల్లె మండలంలోని పలు పాఠశాలల్లో జాయింట్ కలెక్టర్ సాయికాంత్ వర్మ పర్యటించారు. మన బడి నాడు - నేడు పనులను పరిశీలించారు.

jc saikanth varma visit at sundupalli mandal in kadapa district
మన బడి నాడు-నేడు పనులు పరిశీలించిన జాయింట్ కలెక్టర్
author img

By

Published : Oct 21, 2020, 11:45 PM IST

కడప జిల్లా సుండుపల్లె మండలంలో జిల్లా జాయింట్ కలెక్టర్ సాయికాంత్ వర్మ పర్యటించారు. గుట్ట కింద రాచపల్లిలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, బెస్తపల్లి తెలుగులోని మండల ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. మన బడి నాడు-నేడు పనులను పరిశీలించారు. రాచపల్లి పాఠశాలలో పెండింగులో ఉన్న పనులు 15 రోజుల్లోగా పూర్తి చేయాల్సిందిగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు శివయ్యను ఆదేశించారు. బెస్తపల్లిలో పాఠశాలలో జరిగిన పనులపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.

jc saikanth varma visit at sundupalli mandal in kadapa district
పాఠశాలను పరిశీలిస్తున్న జాయింట్​ కలెక్టర్​

అనంతరం.. ఈడిగపల్లి, మడితాడు గ్రామ సచివాలయాలను సందర్శించారు. సిబ్బందికు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు సమగ్ర శిక్ష ప్రాజెక్టు అధికారి ప్రభాకర్ రెడ్డి, మండల తహసీల్దార్ కనకదుర్గయ్య, మండల అభివృద్ధి అధికారి రామచంద్ర రెడ్డి, మండల విద్యాశాఖాధికారి బి. వెంకటేశ్ నాయక్ పాల్గొన్నారు.

ఇదీ చూడండి:

రాష్ట్రంలో కొత్తగా 3,746 కరోనా కేసులు, 27 మరణాలు

కడప జిల్లా సుండుపల్లె మండలంలో జిల్లా జాయింట్ కలెక్టర్ సాయికాంత్ వర్మ పర్యటించారు. గుట్ట కింద రాచపల్లిలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, బెస్తపల్లి తెలుగులోని మండల ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. మన బడి నాడు-నేడు పనులను పరిశీలించారు. రాచపల్లి పాఠశాలలో పెండింగులో ఉన్న పనులు 15 రోజుల్లోగా పూర్తి చేయాల్సిందిగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు శివయ్యను ఆదేశించారు. బెస్తపల్లిలో పాఠశాలలో జరిగిన పనులపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.

jc saikanth varma visit at sundupalli mandal in kadapa district
పాఠశాలను పరిశీలిస్తున్న జాయింట్​ కలెక్టర్​

అనంతరం.. ఈడిగపల్లి, మడితాడు గ్రామ సచివాలయాలను సందర్శించారు. సిబ్బందికు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు సమగ్ర శిక్ష ప్రాజెక్టు అధికారి ప్రభాకర్ రెడ్డి, మండల తహసీల్దార్ కనకదుర్గయ్య, మండల అభివృద్ధి అధికారి రామచంద్ర రెడ్డి, మండల విద్యాశాఖాధికారి బి. వెంకటేశ్ నాయక్ పాల్గొన్నారు.

ఇదీ చూడండి:

రాష్ట్రంలో కొత్తగా 3,746 కరోనా కేసులు, 27 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.