ETV Bharat / state

పథకం ప్రకారమే న్యాయవాది హత్య: పౌరహక్కుల సంఘం నిజనిర్ధరణ కమిటీ అనుమానం - కడపలో న్యాయవాది మృతి చెందిన ప్రాంతాన్ని పరిశీలించిన పౌర హక్కుల నిజనిర్ధరణ కమిటీ

కడప న్యాయవాది సుబ్రహ్మణ్యం మృతి చెందిన స్థలాన్ని.. పౌరహక్కుల సంఘం నిజనిర్ధరణ కమిటీ పరిశీలించింది. పోలీసులు లోతుగా విచారణ జరిపితే మరిన్ని విషయాలు బయటికి వస్తాయని.. కమిటీ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వర్ అభిప్రాయపడ్డారు. పథకం ప్రకారమే హత్య చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు.

civilian rights verification committee investigation in kadapa about lawyer death
కడపలో న్యాయవాది మృతిపై పౌరహక్కుల సంఘం నిజనిర్ధరణ కమిటీ అనుమానాలు
author img

By

Published : Mar 4, 2021, 7:19 AM IST

కడపకు చెందిన ప్రముఖ న్యాయవాది సుబ్రహ్మణ్యంది హత్యేనని.. పౌరహక్కుల సంఘం నిజనిర్ధరణ కమిటీ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వర్ పేర్కొన్నారు. ఘటనా స్థలాన్ని కమిటీ సభ్యులు పరిశీలించారు. పోలీసులు లోతుగా పరిశీలిస్తే మృతికి కారణాలు వెల్లడవుతాయని అభిప్రాయపడ్డారు. సుబ్రహ్మణ్యం ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని తెలిపారు.

సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు, ఆయన వద్ద పనిచేస్తున్న జూనియర్ న్యాయవాదులు, కక్షిదారులను విచారణ చేస్తే నిజాలు బయటకు వస్తాయని ఈశ్వర్ అభిప్రాయపడ్డారు. పథకం ప్రకారమే ఈ హత్య జరిగిందని ఆరోపించారు. ఆయన మృతికి కారకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

కడపకు చెందిన ప్రముఖ న్యాయవాది సుబ్రహ్మణ్యంది హత్యేనని.. పౌరహక్కుల సంఘం నిజనిర్ధరణ కమిటీ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వర్ పేర్కొన్నారు. ఘటనా స్థలాన్ని కమిటీ సభ్యులు పరిశీలించారు. పోలీసులు లోతుగా పరిశీలిస్తే మృతికి కారణాలు వెల్లడవుతాయని అభిప్రాయపడ్డారు. సుబ్రహ్మణ్యం ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని తెలిపారు.

సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు, ఆయన వద్ద పనిచేస్తున్న జూనియర్ న్యాయవాదులు, కక్షిదారులను విచారణ చేస్తే నిజాలు బయటకు వస్తాయని ఈశ్వర్ అభిప్రాయపడ్డారు. పథకం ప్రకారమే ఈ హత్య జరిగిందని ఆరోపించారు. ఆయన మృతికి కారకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:

లారీ, ద్విచక్రవాహనం ఢీ... యువకుడు మృతి

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.